ETV Bharat / state

బావిలో మృతదేహాలు.. వీడుతున్న మిస్టరీ

వరంగల్​ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలోని పాడుబడ్డ బావిలో 9 మృతదేహాలు లభించిన కేసు ఇప్పుడిప్పుడే మిస్టరీ వీడుతోంది. ఫోరెన్సిక్‌ ప్రాథమిక నివేదికలో ఈ మృతులకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడుతున్నాయి.

author img

By

Published : May 23, 2020, 7:12 PM IST

warangal rural gorrekunta well mysterious deaths over all story
బావిలో మృతదేహాలు.. వీడుతున్న మిస్టరీ

వరంగల్ గ్రామీణ జిల్లా గొర్లెకుంట గోదాం సమీపంలోని పాడుబడిన బావిలో 9 మృతదేహాలు వెలుగుచూసిన ఘటనకు సంబంధించి.. పోలీసులు కీలకమైన ఆధారాలను సేకరిస్తున్నారు. ఇవాళ ఉదయం అదనపు డీసీపీ వెంకటలక్ష్మి నేతృత్వంలో పోలీసులు, ఐబీ బృందం.. బావి పరిసర ప్రాంతాలను ముమ్మరంగా శోధించారు. మక్సూద్​, బిహారీ యువకులు ఉంటున్న గదులను.. అక్కడి నుంచి బావికి ఉన్న దూరాన్ని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్​ వైద్య నిపుణులు రజామాలిక్​ను తీసుకెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. బావిలోకి సైతం దిగి అణువణువూ శోధించారు.

ఎవరా మహిళ?

గొర్రెకుంట ప్రాంతం వద్ద మూడు చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్​ డేటా సేకరిస్తున్నారు. కేసుకు సంబంధించి ఇద్దరు బిహారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కేసు పురోగతికి చెందిన కీలక సమాచారం పోలీసులు రాబట్టారు. బిహార్​కు చెందిన యువకుడి చరవాణి నుంచి ఒక మహిళకు ఫోన్​ వెళ్లినట్లుగా ఉండటం వల్ల ఆమెనూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే కేసులో శవపరీక్ష నివేదిక కీలకం కానుంది.

ఆ రెండు నివేదికలు వస్తేనే...

నీట మునిగి చనిపోయి ఉంటారన్నది భావిస్తున్నట్లు ఫోరెన్సిక్​ నిపుణులు స్పష్టం చేశారు. అయితే ఎఫ్​ఎస్​ఎల్​, విసెరా నివేదికలు వచ్చేకే తుది నిర్ణయానికి వస్తామని వెల్లడించారు. మృతదేహాలపై పెనుగులాట.. తీవ్రగాయాలు లేవని ఈడ్చుకొచ్చిన గాయాలు మాత్రం కనిపించాయని చెప్పారు. 10 నుంచి 14 రోజుల్లో పూర్తి నివేదికలు వస్తాయని ప్రకటించారు.

పోస్ట్​ మార్టం పూర్తయిన మృతదేహాలు ఎంజీఎం మార్చురీకే పరిమితమయ్యాయి. షకీల్ మృతదేహం కోసం ఉదయం నుంచి భార్య ఎదురుచూపులు ఫలించలేదు. మరికొన్ని నమూనాలు సేకరించాల్సి ఉండడం వల్ల మార్చురీలోనే అన్ని మృతదేహాలను భద్రపరిచారు. పశ్చిమ్ బంగకు తీసుకువెళ్లేందుకు మక్సూద్​ బంధువులు సముఖత చూపకపోవడం వల్ల షకీల్​తో పాటుగా మిగిలిన మృతదేహాల ఖననం వరంగల్​లోనే జరగనుంది.

సంబంధిత కథనం: గొర్రెకుంట బావిలో మృతదేహాలపై వీడుతున్న మిస్టరీ

వరంగల్ గ్రామీణ జిల్లా గొర్లెకుంట గోదాం సమీపంలోని పాడుబడిన బావిలో 9 మృతదేహాలు వెలుగుచూసిన ఘటనకు సంబంధించి.. పోలీసులు కీలకమైన ఆధారాలను సేకరిస్తున్నారు. ఇవాళ ఉదయం అదనపు డీసీపీ వెంకటలక్ష్మి నేతృత్వంలో పోలీసులు, ఐబీ బృందం.. బావి పరిసర ప్రాంతాలను ముమ్మరంగా శోధించారు. మక్సూద్​, బిహారీ యువకులు ఉంటున్న గదులను.. అక్కడి నుంచి బావికి ఉన్న దూరాన్ని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్​ వైద్య నిపుణులు రజామాలిక్​ను తీసుకెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. బావిలోకి సైతం దిగి అణువణువూ శోధించారు.

ఎవరా మహిళ?

గొర్రెకుంట ప్రాంతం వద్ద మూడు చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్​ డేటా సేకరిస్తున్నారు. కేసుకు సంబంధించి ఇద్దరు బిహారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కేసు పురోగతికి చెందిన కీలక సమాచారం పోలీసులు రాబట్టారు. బిహార్​కు చెందిన యువకుడి చరవాణి నుంచి ఒక మహిళకు ఫోన్​ వెళ్లినట్లుగా ఉండటం వల్ల ఆమెనూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే కేసులో శవపరీక్ష నివేదిక కీలకం కానుంది.

ఆ రెండు నివేదికలు వస్తేనే...

నీట మునిగి చనిపోయి ఉంటారన్నది భావిస్తున్నట్లు ఫోరెన్సిక్​ నిపుణులు స్పష్టం చేశారు. అయితే ఎఫ్​ఎస్​ఎల్​, విసెరా నివేదికలు వచ్చేకే తుది నిర్ణయానికి వస్తామని వెల్లడించారు. మృతదేహాలపై పెనుగులాట.. తీవ్రగాయాలు లేవని ఈడ్చుకొచ్చిన గాయాలు మాత్రం కనిపించాయని చెప్పారు. 10 నుంచి 14 రోజుల్లో పూర్తి నివేదికలు వస్తాయని ప్రకటించారు.

పోస్ట్​ మార్టం పూర్తయిన మృతదేహాలు ఎంజీఎం మార్చురీకే పరిమితమయ్యాయి. షకీల్ మృతదేహం కోసం ఉదయం నుంచి భార్య ఎదురుచూపులు ఫలించలేదు. మరికొన్ని నమూనాలు సేకరించాల్సి ఉండడం వల్ల మార్చురీలోనే అన్ని మృతదేహాలను భద్రపరిచారు. పశ్చిమ్ బంగకు తీసుకువెళ్లేందుకు మక్సూద్​ బంధువులు సముఖత చూపకపోవడం వల్ల షకీల్​తో పాటుగా మిగిలిన మృతదేహాల ఖననం వరంగల్​లోనే జరగనుంది.

సంబంధిత కథనం: గొర్రెకుంట బావిలో మృతదేహాలపై వీడుతున్న మిస్టరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.