వరంగల్ గ్రామీణ జిల్లాలోని సంగెం మండలం తీగరాజుపల్లె, గుంటూరుపల్లెలో హరితహారంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొక్కలు నాటారు. ఆకుపచ్చ తెలంగాణనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ హరితహారానికి అంకురార్పణ చేశారని చెప్పారు.
ప్రజలు ప్రజా ప్రతినిధులు ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకోవాలన్నారు. రాబోయే తరాలకు ఆహ్లాదకరమైన వృక్ష సంపదను బహుమతిగా ఇవ్వాలన్నారు. మొక్కలు నాటితే సరిపోదని వాటి సంరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'రామాయణం నుంచి మొదలు పెడితే 1991 దాకా ఒక్కరూ లేరు