కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం గోజేగాం గ్రామానికి చెందిన 90మంది గిరిజన వలస కూలీలు ఉపాధి కోసం ఖమ్మం జిల్లా జూలూరుపాడుకు వెళ్లారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక పిల్లలను తీసుకుని సొంతూరు బాట పట్టారు.
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణ సమీపంలో వీరిని పోలీసులు అడ్డగించారు. పోలీసులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే వారికి భోజనం పెట్టించి, అధికారులతో మాట్లాడి ప్రత్యేక వాహనాల్లో వారిని స్వగ్రామాలకు చేర్చారు.