ETV Bharat / state

'పరకాల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయాలి'

author img

By

Published : Oct 31, 2019, 8:48 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పార్టీ కార్యకర్తలతో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు.

పార్టీ సమావేశం

వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలని స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని స్వర్ణ గార్డెన్స్​లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికలను కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చొరవతో అధిక నిధులు మంజూరు చేసుకొని పరకాల పట్టణంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు.

పరకాలలో పార్టీ కార్యకర్తలతో చల్లా సమావేశం

ఇదీ చదవండిః సుబ్రహ్మణ్య స్వామికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు

వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలని స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని స్వర్ణ గార్డెన్స్​లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికలను కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చొరవతో అధిక నిధులు మంజూరు చేసుకొని పరకాల పట్టణంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు.

పరకాలలో పార్టీ కార్యకర్తలతో చల్లా సమావేశం

ఇదీ చదవండిః సుబ్రహ్మణ్య స్వామికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు

Intro:TG_WGL_43_31_TRS_MEETNG_AB_TS10074.mp4
Cantributer kranthi parakala
వరంగల్ రూరల్ జిల్లా.
పరకాల నియోజకవర్గం.

వరంగల్ రురల్ జిల్లా పరకాల లో గులాబీ జెండా ఎగురవేయాలి...ఎమ్మెల్యే చల్లా...*

పరకాల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.అందుకు తెరాస నాయకులు,కార్యకర్తలు,మాజీ ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు,డివిజన్ అధ్యక్షకార్యదర్శులు కలిసికట్టుగా కృషిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

గురువారం పట్టణంలోని స్వర్ణ గార్డెన్స్ లో మున్సిపాలిటీ పరిధిలోని పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలను కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు.

రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు.ఎవరికి టికెట్ ఇచ్చినా కార్యకర్తలంతా కలిసికట్టుగా కృషిచేయాలని,మున్సిపల్ పరిధిలోని 22 వార్డుల్లో తెరాస పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషిచేయాలన్నారు.

టికెట్ ఆశించి బంగపడ్డవారు నిరాశ చెందవద్దని,పార్టీకోసం పనిచేసే వారికి అందరికి పార్టీ సుముచితస్థానం కల్పిస్తుందన్నారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే సహించేదిలేదన్నారు.

ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు నా ఆరోగ్యం బాగా లేకున్నా నా గెలుపుకు మీరు చేసిన కృషి వెలకట్టలేనిది. మీ రుణం తీర్చుకోలేనిది.

ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో ఉన్న 22 వార్డులకు ఒక్కొక్క వార్డుకు ఒక్కరిని ఇంచార్జిలను నియమిస్తున్నట్లు వారు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ప్రజలకోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు.

ముఖ్యమంత్రి గారి చొరవతో అధిక నిధులు మంజూరు చేసుకొని పరకాల పట్టణంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు.

ఈ రోజు ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందన్నారు.అందుకే తెరాస ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు.

రాజకీయాల్లో రోజులు గడవడానికి,తెరాస ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలు, ప్రచారాలను ప్రజలకు తెలియపరుచాలన్నారు.

తెరాస ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలకు వణుకుపుట్టిందన్నారు.

ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తుగడలు వేసిన,ప్రజల గుండెల్లో ఉన్న తెరాస పార్టీ ఏమిచేయలేవన్నారు.అందుకు నిదర్శనం మొన్న జరిగిన హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలే ప్రతిపక్షాలకు చెంప పెట్టు అన్నారు.

ఎవరి సత్తా ఏంటో ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెలుస్తుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు,చేసిన అభివృద్ధి చేసే తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పడుతారన్నారు.

ఈ మున్సిపల్ ఎన్నికల్లో పరకాలలో 22 వార్డులో తెరాస అభ్యర్థులు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో తెరాస నాయకులు,కార్యకర్తలు,మాజీ ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు,వార్డు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.Body:TG_WGL_43_31_TRS_MEETNG_AB_TS10074.mp4Conclusion:TG_WGL_43_31_TRS_MEETNG_AB_TS10074.mp4
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.