వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో శాసనసభ్యులు సుదర్శన్రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. 35 మంది లబ్ధిదారులకు పదిలక్షల విలువైన చెక్కులను ఇవాళ అందజేశారు. పేదవాళ్లకు మద్దతుగా కేసీఆర్ తన సహాయనిధి నుంచి డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దరఖాస్తు పెట్టుకున్న ప్రతి మంజూరయ్యాయని... తన నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 16.5 కోట్ల రూపాయలు విడుదలయ్యాని తెలిపారు. రోగాల బారిన పడిన కుటుంబాలకు అందించడం జరిగిందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కశ్మీర్ శాసన మండలి రద్దు.. 62 ఏళ్ల చరిత్రకు తెర