ETV Bharat / state

బ్యాంకు ముందు ఖాతాదారుడి రచ్చ

బ్యాంకులో డబ్బులు జమ చేయడానికి వెళ్తే బ్యాంకు మేనేజర్ ఖాతా పుస్తకాన్ని చించేసిందని ఓ ఖాతాదారుడు బ్యాంకు ముందు బైఠాయించాడు. అయితే బ్యాంక్ మేనేజర్ మాత్రం తాగొచ్చి రచ్చ చేశాడని ఆరోపించారు.

author img

By

Published : May 24, 2019, 9:49 PM IST

ఖాతాదారుడు ఇష్టారీతిలో మాట్లాడాడు : బ్యాంకు మేనేజర్

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో ఏకే తండాకు చెందిన నర్సింహ మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంకుకు వెళ్లాడు. తన ఖాతాలో డబ్బులు జమ చేయాలని కోరగా వారం రోజుల తర్వాత రావాలని బ్యాంక్ మేనేజర్ మానస సూచించారు. తాను హైదరాబాద్​లో ఉంటున్నానని మళ్లీ రావడం ఇబ్బంది అవుతుందని చెప్పినా పట్టించుకోకుండా ఖాతా పుస్తకం చించేసిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు అరగంట పాటు బ్యాంకు ముందు బైఠాయించాడు.

మద్యం సేవించి బ్యాంకు సమయం ముగిసిన తర్వాత వచ్చి ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఇష్టారీతిలో మాట్లాడడని బ్యాంకు మేనేజర్ మానస ఆరోపిస్తున్నారు. అతనే ఖాతా పుస్తకం చించేసుకున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

ఖాతా పుస్తకాన్ని చించేసిందని బ్యాంకు ముందు బైఠాయించిన ఖాతాదారుడు
ఇవీ చూడండి : 'ఇంటర్​ ఫలితాల్లో అవకతవకలపై న్యాయం చేయండి'

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో ఏకే తండాకు చెందిన నర్సింహ మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంకుకు వెళ్లాడు. తన ఖాతాలో డబ్బులు జమ చేయాలని కోరగా వారం రోజుల తర్వాత రావాలని బ్యాంక్ మేనేజర్ మానస సూచించారు. తాను హైదరాబాద్​లో ఉంటున్నానని మళ్లీ రావడం ఇబ్బంది అవుతుందని చెప్పినా పట్టించుకోకుండా ఖాతా పుస్తకం చించేసిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు అరగంట పాటు బ్యాంకు ముందు బైఠాయించాడు.

మద్యం సేవించి బ్యాంకు సమయం ముగిసిన తర్వాత వచ్చి ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఇష్టారీతిలో మాట్లాడడని బ్యాంకు మేనేజర్ మానస ఆరోపిస్తున్నారు. అతనే ఖాతా పుస్తకం చించేసుకున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

ఖాతా పుస్తకాన్ని చించేసిందని బ్యాంకు ముందు బైఠాయించిన ఖాతాదారుడు
ఇవీ చూడండి : 'ఇంటర్​ ఫలితాల్లో అవకతవకలపై న్యాయం చేయండి'
Intro:tg_wgl_39_25_bank_mundu_baitainchi_khathdaruni_andolana_ab_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )బ్యాంక్ లో డబ్బులు జమ చెయ్యడానికి వొస్తే బ్యాంక్ మేనేజర్ ఖాతా పుస్తకాన్ని చించేసిందని ఓ ఖాతాదారుడు బ్యాంకు ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసిన సంఘటన వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రం లో జరిగింది. రాయపర్తి మండలంలోని ఏ కే తండాకు చెందిన నర్సింహ మండల కేంద్రంలోని ఏపీజీవీబీ కి వచ్చాడు. తమ ఖాతాలో డబ్బులు వేయాలని కోరగా వారం రోజుల తర్వాత రావాలని బ్యాంక్ మేనేజర్ మానస అనడం తో తాను హైదరాబాద్ లో ఉంటున్నానని మళ్ళీ రావడం ఇబ్బంది అవుతుందని వేయాలని కోరినా పట్టించుకోకుండా ఖాతా పుస్తకం చించేసిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు అరగంట పాటు బ్యాంక్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేయడం తో అధిక సంఖ్యలో జనం చేరుకున్నారు. మద్యం సేవించి బ్యాంక్ సమయం ముగిసిన తర్వాత వొచ్చి తన ఖాతాలో డబ్బులు జమ చెయ్యలని ఇష్టారాజ్యంగా మాట్లాడడని బ్యాంకు మేనేజర్ మానస అన్నారు. తానే బ్యాంక్ ఖాతా పుస్తకం చించేసుకున్న దృశ్యాలు సీసీ కెమెరా లో నిక్షిప్తం అయ్యాయన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు వివరాలు సేకరిస్తున్నారు.
01 నర్సింహ, బాధితుడు, ఏ కే తండా


Body:s


Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.