ETV Bharat / state

'వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు' కథనానికి స్పందన - wanaparthy dmho speaks on etv Bharat news

వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మామిడిమాడ పరిధిలోని ఆర్​ఎంపీ వైద్యుల తీరుపై 'ఈటీవీ భారత్​' కథనానికి జిల్లా వైద్యాధికారి స్పందించారు. నాలుగు తండాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

wanaparthy dmho responds on etv bharat news
'వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు' కథనానికి స్పందన
author img

By

Published : Dec 25, 2019, 11:11 PM IST

వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మామిడిమాడ పరిధిలోని ఆర్​ఎంపీ వైద్యుల తీరుపై 'వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు' పేరిట ఈటీవీ భారత్​ కథనానికి జిల్లా వైద్యాధికారి స్పందించారు. మామిడిమాడ గ్రామపరిధిలోని నాలుగు తండాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు.

నాలుగు తండాల పరిధిలో 83 మంది మహిళల గర్భసంచిని తొలగించినట్లు గుర్తించారు. ఇందులో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు మహిళలు 20 మంది ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు.

ఏం జరిగింది..

తండాల్లోని మహిళల అమాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని కొందరు వైద్యులు కాసులు కొల్లగొడుతున్నారు. ఏ చిన్న రోగం వచ్చినా.. నొప్పులని వైద్యశాలకు వెళ్లినా.. గర్భసంచి తొలగిస్తే అన్ని సమస్యలు ఇట్టే పరిష్కారమైపోతాయని అపోహలు కల్పిస్తున్నారు. లేకుంటే ప్రాణాలకే ప్రమాదమని తప్పుదోవ పట్టిస్తున్నారు. తండాల్లో కొందరు ఆర్‌ఎంపీలు తిష్ఠ వేసి మరి ఇదే పని మీద ఉంటున్నారు. వారి మాటలను నమ్మి.. గర్భసంచి తొలగింపుతో భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల గురించి తెలియక చాలామంది మహిళలు శస్త్రచికిత్స చేయించుకొని నానా తంటాలు పడుతున్నారు.

అవగాహన కల్పిస్తాం..

ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్​ఓ శ్రీనివాసులు తెలిపారు. తండాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామన్నారు. మహిళలకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

'వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు' కథనానికి స్పందన

ఇవీచూడండి: వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు

వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మామిడిమాడ పరిధిలోని ఆర్​ఎంపీ వైద్యుల తీరుపై 'వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు' పేరిట ఈటీవీ భారత్​ కథనానికి జిల్లా వైద్యాధికారి స్పందించారు. మామిడిమాడ గ్రామపరిధిలోని నాలుగు తండాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు.

నాలుగు తండాల పరిధిలో 83 మంది మహిళల గర్భసంచిని తొలగించినట్లు గుర్తించారు. ఇందులో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు మహిళలు 20 మంది ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు.

ఏం జరిగింది..

తండాల్లోని మహిళల అమాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని కొందరు వైద్యులు కాసులు కొల్లగొడుతున్నారు. ఏ చిన్న రోగం వచ్చినా.. నొప్పులని వైద్యశాలకు వెళ్లినా.. గర్భసంచి తొలగిస్తే అన్ని సమస్యలు ఇట్టే పరిష్కారమైపోతాయని అపోహలు కల్పిస్తున్నారు. లేకుంటే ప్రాణాలకే ప్రమాదమని తప్పుదోవ పట్టిస్తున్నారు. తండాల్లో కొందరు ఆర్‌ఎంపీలు తిష్ఠ వేసి మరి ఇదే పని మీద ఉంటున్నారు. వారి మాటలను నమ్మి.. గర్భసంచి తొలగింపుతో భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల గురించి తెలియక చాలామంది మహిళలు శస్త్రచికిత్స చేయించుకొని నానా తంటాలు పడుతున్నారు.

అవగాహన కల్పిస్తాం..

ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్​ఓ శ్రీనివాసులు తెలిపారు. తండాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామన్నారు. మహిళలకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

'వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు' కథనానికి స్పందన

ఇవీచూడండి: వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు

Intro:tg_mbnr_15_25_yenkithandalo_dmho_survey_vo_avb_ts10053
వనపర్తి జిల్లా కిల గణపురం మండలం మామిడిమాడ గ్రామ పరిధిలోని నాలుగు తండాలలో వనపర్తి వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు
ఈనాడు ఈ టీవీ లు ప్రసారమైన ఈ వైద్యులు ఆగర్భ శత్రువులుగా అనే కథనానికి స్పందించిన వైద్యులు ఈ తండాలలో ఇంటింటి సర్వే చేపట్టారు
ఈ సర్వేలో నలుగు తండాల పరిధిలో 83 మంది మహిళలు గర్భసంచిని తొలగించనున్నట్లు వారు గుర్తించారు ఇందులో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు 20 మంది మహిళలు ఉంటారని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాసులు తెలియజేశారు
నిరక్షరాస్యులైన తండావాసులు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆర్ఎంపీలు తండాలలో పర్యటిస్తూ ఏ చిన్న సమస్య ఉన్నా గర్భసంచిని తొలగించుకుంటే సరిపోతుందని వారిని నమ్మించి కమీషన్ల రూపంలో డబ్బులు దండుకునేందుకు ఈ కార్యక్రమానికి పూనుకున్నారని వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎంఅండ్హెచ్ఓ శ్రీనివాసులు పేర్కొన్నారు
ఈ సంఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన సూచించారు
తమ వైద్య సిబ్బందితో తండాలు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి గిరిజన మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తామని ఆయన గిరిజన మహిళలకు సూచిం చారుBody:tg_mbnr_15_25_yenkithandalo_dmho_survey_vo_avb_ts10053Conclusion:tg_mbnr_15_25_yenkithandalo_dmho_survey_vo_avb_ts10053
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.