ETV Bharat / state

గ్రామస్థులకు కలెక్టర్ శ్వేతా మహంతి హెచ్చరిక - వనపర్తి జిల్లా కలెక్టర్​ శ్వేతా మహంతి

30 రోజుల ప్రణాళికలో భాగంగా వనపర్తి జిల్లా కనిమెట్టలో వనపర్తి జిల్లా కలెక్టర్​ శ్వేతా మహంతి పర్యటించారు. కొత్తగా నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను పరిశీలించారు. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు సూచించారు.

గ్రామస్థులకు కలెక్టర్ శ్వేతా మహంతి హెచ్చరిక
author img

By

Published : Sep 16, 2019, 7:52 PM IST

గ్రామస్థులకు కలెక్టర్ శ్వేతా మహంతి హెచ్చరిక

వనపర్తి జిల్లాలో పర్యటించిన పాలనాధికారి శ్వేతా మహంతి... కనిమెట్ట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటారు. గ్రామంలోని పలు కాలనీలను పరిశీలించారు. ఇళ్ల నుంచి మురుగునీరు బయటకు వదలడం గమనించారు. అలా చేసిన వారికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. నీటిని ఎక్కువ కాలం నిల్వ చేయకూడదని హెచ్చరించారు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామస్థులంతా అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.

గ్రామస్థులకు కలెక్టర్ శ్వేతా మహంతి హెచ్చరిక

వనపర్తి జిల్లాలో పర్యటించిన పాలనాధికారి శ్వేతా మహంతి... కనిమెట్ట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటారు. గ్రామంలోని పలు కాలనీలను పరిశీలించారు. ఇళ్ల నుంచి మురుగునీరు బయటకు వదలడం గమనించారు. అలా చేసిన వారికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. నీటిని ఎక్కువ కాలం నిల్వ చేయకూడదని హెచ్చరించారు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామస్థులంతా అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.

Intro:30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా వనపర్తి జిల్లా ,కొత్తకోట మండలం , కనిమెట్ట గ్రామంలో పర్యటించిన జిల్లా పాలనాధికారిని శ్వేతామహంతి.


Body:వనపర్తి జిల్లా , కొత్తకోట మండలం, కనిమెట్ట గ్రామంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా జిల్లా పాలనాధికారి శ్వేతా మహంతి గ్రామంలో పర్యటించారు. మొదటగా గ్రామం లోని ప్రాథమికోన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. అక్కడే కొత్తగా నిర్మిస్తున్న ఇంకుడు గుంతలు పరిశీలించడం జరిగింది.
తర్వాత అంగన్వాడి కేంద్రం లోనికి వెళ్లి, వివిధ రికార్డులను పరిశీలించడం జరిగింది. అంగన్వాడి కేంద్రం విద్యార్థుల గురించి వారి యొక్క బరువులను కొలిచి రికార్డులలో ఉన్నట్టు వంటి సమాచారాన్ని పరిశీలించడం జరిగింది.
తర్వాత గ్రామస్తులతో కలిసి గ్రామంలోని వివిధ కాలనీలలో పర్యటించారు. ఇళ్ల నుండి బయటకు విడుదల చేసిన మురుగునీటిని చూసి, మురుగు నీరు బయటకు విడుదల చేయకూడదని ,అలా చేసిన వారికి పెనాల్టీ విధించాలని అధికారులకు సూచించారు.
గ్రామంలోని ప్రజలు తాగునీటిలో తమ సంపులలో నిల్వ చేసుకుంటున్నారని, అలా చేయడం వల్ల చివర ఉన్న వారికి కి నీటి లభ్యత ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు.
30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా గ్రామంలో పిచ్చి మొక్కలు తొలగించాలని , డ్రైనేజీ ని శుభ్రపరచుకోవాలని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించుకొని వాటిని ఉపయోగించాలని సూచించారు. గ్రామంలో ఉన్న రహదారులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అని తెలిపారు.
దారులలో నీరు నిల్వ ఉండటం వల్ల వివిధ రకాలైనటువంటి రోగాల బారిన పడడం జరుగుతుందని కాబట్టి అందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. గ్రామస్తులంతా కలిసి 30 రోజుల్లో కార్యచరణ ప్రణాళికను సఫలీకృతం చేస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ వామన్ గౌడ్ ,కొత్తకోట మండల ఎంపిపి గుంత మౌనిక ,ఇతర అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


Conclusion:కిట్ నెంబర్ 1269,
పి. నవీన్,
9966071291

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.