రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాల్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా నిర్వహించారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని.. వారి పోరాటం ఉద్ధృతం కాకముందే సీఎం కేసీఆర్ స్పందించాలని... వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ ఆందోళన న్యాయమైందని... వారి వెనకాల తానుంటానని ఆయన భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి: ఆ రెండు గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించాలంటూ ధర్నా