ETV Bharat / state

Praja Sangrama Yatra: వికారాబాద్​లో బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర - Praja Sangrama Yatra news

బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి అర్బన్‌, గ్రామీణ జిల్లాల మీదుగా వికారాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించింది.

Praja Sangrama Yatra
వికారాబాద్​లో బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర
author img

By

Published : Sep 4, 2021, 8:30 AM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి అర్బన్‌, గ్రామీణ జిల్లాల మీదుగా వికారాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించింది. ఎనిమిదవ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నేడు వికారాబాద్ సమీపంలోని డెంటల్ కళశాల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.

వికారాబాద్‌ టౌన్‌, బాబు జగ్జీవన్‌రావు విగ్రహాం మీదగా మందాన్‌ పల్లి వరకు 13 కిలో మీటర్ల మేర సాగనుంది. మధ్యాహ్నాం వికారాబాద్‌ పట్టణంలో జరిగే సభకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడణవీస్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించనున్నారు. రాత్రి మందాన్‌ పల్లిలో బస చేయనున్నారు.

ఏడో రోజు ప్రజా సంగ్రామ యాత్ర చిట్టెంపల్లి నుంచి ప్రారంభమైంది. వేలాది మంది కార్యకర్తలు, భాజపా అభిమానులు ఆయన వెంట నడిచారు. మధ్యాహ్నానికి మన్నెగుడకు చేరుకుని... బహిరంగ సభను నిర్వహించారు. అనంతరం మొదలైన పాదయాత్ర రాత్రి 8గంటల వరకు సాగింది. సాయంత్రానికి పట్టణానికి చేరుకున్న సంజయ్​కు వికారాబాద్​ పట్టణ మహిళా మోర్చా నేతలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి హారతి ఇచ్చారు. అనంతరం సాయి డెంటల్ కళాశాలలో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు.

ఇదీ చూడండి: BANDI SANJAY PADAYATRA: ఈటల రాజేందర్​ గెలుపు ఖాయం: బండి

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి అర్బన్‌, గ్రామీణ జిల్లాల మీదుగా వికారాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించింది. ఎనిమిదవ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నేడు వికారాబాద్ సమీపంలోని డెంటల్ కళశాల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.

వికారాబాద్‌ టౌన్‌, బాబు జగ్జీవన్‌రావు విగ్రహాం మీదగా మందాన్‌ పల్లి వరకు 13 కిలో మీటర్ల మేర సాగనుంది. మధ్యాహ్నాం వికారాబాద్‌ పట్టణంలో జరిగే సభకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడణవీస్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించనున్నారు. రాత్రి మందాన్‌ పల్లిలో బస చేయనున్నారు.

ఏడో రోజు ప్రజా సంగ్రామ యాత్ర చిట్టెంపల్లి నుంచి ప్రారంభమైంది. వేలాది మంది కార్యకర్తలు, భాజపా అభిమానులు ఆయన వెంట నడిచారు. మధ్యాహ్నానికి మన్నెగుడకు చేరుకుని... బహిరంగ సభను నిర్వహించారు. అనంతరం మొదలైన పాదయాత్ర రాత్రి 8గంటల వరకు సాగింది. సాయంత్రానికి పట్టణానికి చేరుకున్న సంజయ్​కు వికారాబాద్​ పట్టణ మహిళా మోర్చా నేతలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి హారతి ఇచ్చారు. అనంతరం సాయి డెంటల్ కళాశాలలో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు.

ఇదీ చూడండి: BANDI SANJAY PADAYATRA: ఈటల రాజేందర్​ గెలుపు ఖాయం: బండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.