ETV Bharat / state

సరిహద్దు గ్రామాలు, పట్టణాలలో కొవిడ్​ పరిస్థితులపై ఆరా..

author img

By

Published : Jun 4, 2021, 2:10 PM IST

జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్​లో​ రాష్ట్ర వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి రిజ్వి, డైరెక్టర్ శ్రీనివాస రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సరిహద్దు పట్టణాలు, గ్రామాల్లో కొవిడ్​ పరిస్థితులపై వైద్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

Telangana news
గద్వాల జిల్లా వార్తలు

రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని పట్టణాలు, గ్రామాల్లో కొవిడ్​ పరిస్థితులపై స్థానిక అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వి, డైరెక్టర్​ శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో సమావేశమయ్యారు. గ్రామాల్లో కొవిడ్​ కట్టడికి అమలు చేస్తున్న కార్యక్రమాలను రిజ్వి అడిగి తెలుసుకున్నారు. కొవిడ్​ వచ్చినవారికి అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.

శానిటైజేషన్​, సలహాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితరాలను అడిగి తెలుసుకున్నారు. థర్డ్​వేవ్​ను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అలంపూర్​లో వంద పడకల ఆస్పత్రిని నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్​పర్సన్​ కోరారు.

రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని పట్టణాలు, గ్రామాల్లో కొవిడ్​ పరిస్థితులపై స్థానిక అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వి, డైరెక్టర్​ శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో సమావేశమయ్యారు. గ్రామాల్లో కొవిడ్​ కట్టడికి అమలు చేస్తున్న కార్యక్రమాలను రిజ్వి అడిగి తెలుసుకున్నారు. కొవిడ్​ వచ్చినవారికి అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.

శానిటైజేషన్​, సలహాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితరాలను అడిగి తెలుసుకున్నారు. థర్డ్​వేవ్​ను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అలంపూర్​లో వంద పడకల ఆస్పత్రిని నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్​పర్సన్​ కోరారు.

ఇదీ చూడండి: Vaccination: ఐటీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.