ETV Bharat / state

బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిన తల్లి - mother

మగబిడ్డకు జన్మనిచ్చి ఓ మహిళ మృతి చెందిన ఘటన నిజామాబాద్​ జిల్లా సాటపూర్​గేట్​ గ్రామంలో చోటుచేసుకుంది. ఆమె మృతికి బోధన్​లో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి సోదరి ఆరోపించారు.

బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిన తల్లి
author img

By

Published : Jun 12, 2019, 3:41 PM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటపూర్​గేట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుష్పలతను ప్రసవం కొరకు బోధన్ ఏరియా ఆసుపత్రికి తీసుకరాగా మంగళవారం మధ్యాహ్నం మగ బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. తల్లి క్షేమంగా ఉందని మొదట్లో చెప్పిన వైద్యులు ప్రసవం అయిన రెండు గంటల తర్వాత ఫిట్స్ వచ్చాయని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉందని నిజామాబాద్ తీసుకుని వెళ్లాలని వైద్యులు సూచించడం వల్ల అక్కడికి తీసుకుని వెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని అక్కడి వైద్యులు చెప్పారని మృతురాలి సోదరి వివరించారు. బోధన్​లోని వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని మృతురాలి సోదరి ఆరోపించారు.

బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిన తల్లి

ఇవీ చూడండి: 'పది నిమిషాలు ముందెళ్తే నా కొడుకు బతికేవాడు'

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటపూర్​గేట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుష్పలతను ప్రసవం కొరకు బోధన్ ఏరియా ఆసుపత్రికి తీసుకరాగా మంగళవారం మధ్యాహ్నం మగ బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. తల్లి క్షేమంగా ఉందని మొదట్లో చెప్పిన వైద్యులు ప్రసవం అయిన రెండు గంటల తర్వాత ఫిట్స్ వచ్చాయని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉందని నిజామాబాద్ తీసుకుని వెళ్లాలని వైద్యులు సూచించడం వల్ల అక్కడికి తీసుకుని వెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని అక్కడి వైద్యులు చెప్పారని మృతురాలి సోదరి వివరించారు. బోధన్​లోని వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని మృతురాలి సోదరి ఆరోపించారు.

బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిన తల్లి

ఇవీ చూడండి: 'పది నిమిషాలు ముందెళ్తే నా కొడుకు బతికేవాడు'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.