సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడులో నిర్వాసితుల భూమి హక్కు పత్రాలను పరిశీలించేందుకు వచ్చిన ఆర్ఐతో స్థానిక మహిళలు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది.
బాధితురాలు మోతి(54) ను ఆసుపత్రికు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే.. గుండె పోటుతో మృతి చెందింది. ఆర్ఐ కారణంగానే మోతి చనిపోయిందంటూ.. కుటుంబసభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: మల్లన్నసాగర్ నిర్వాసితుల వంటా వార్పు