ETV Bharat / state

భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం... ఎందుకంటే...? - wife protest at husbands house

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె పుట్టిందనే నెపంతో భార్యను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్న ఓ భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ వారం రోజులుగా మౌనపోరాటం చేస్తుంది. ఈ ఘటన ఆత్మకూరు మండలం పాతర్లపహాడ్​ గ్రామంలో చోటు చేసుకుంది.

భార్య ఆందోళన
author img

By

Published : Aug 27, 2019, 5:03 AM IST

భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం... ఎందుకంటే...?

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపహాడ్​లో ఓ భర్త ఆడపిల్ల పుట్టిందనే నెపంతో తన భార్యను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. దీనిపై అతని భార్య ఇంటి ముందు ఆందోళనకు దిగింది. గ్రామానికి చెందిన అస్లాం నకిరేకల్​ పట్టణంలోని ముత్తూట్​ ఫైనాన్స్​లో మేనేజర్​గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 2014లో దేవరకొండకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో వివాహమైంది. ఆమె ప్రవర్తన బాగాలేదంటూ ఓ పాప పుట్టాక 2016 జనవరి నెలలో వక్ఫ్​ బోర్డు నుంచి విడాకులు తీసుకున్నాడు. అనంతరం అదే ఏడాది నల్గొండకు చెందిన తబసుంను రెండో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ అతనికి కుమార్తె పుట్టినప్పటి నుంచి వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఆడపిల్ల పుట్టిందనే సాకుతో అదనపు కట్నం కావాలని వేధిస్తూ తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సిలింగ్​ చేసినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. తనకు న్యాయం చేయాలని వారం రోజులుగా ఆమె భర్త ఇంటి ముందు మౌనపోరాటం చేస్తుంది.

ఇదీ చూడండి : వైద్యం వికటించి బాలుడి మృతి... ఆసుపత్రి ఎదుట ఆందోళన

భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం... ఎందుకంటే...?

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపహాడ్​లో ఓ భర్త ఆడపిల్ల పుట్టిందనే నెపంతో తన భార్యను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. దీనిపై అతని భార్య ఇంటి ముందు ఆందోళనకు దిగింది. గ్రామానికి చెందిన అస్లాం నకిరేకల్​ పట్టణంలోని ముత్తూట్​ ఫైనాన్స్​లో మేనేజర్​గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 2014లో దేవరకొండకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో వివాహమైంది. ఆమె ప్రవర్తన బాగాలేదంటూ ఓ పాప పుట్టాక 2016 జనవరి నెలలో వక్ఫ్​ బోర్డు నుంచి విడాకులు తీసుకున్నాడు. అనంతరం అదే ఏడాది నల్గొండకు చెందిన తబసుంను రెండో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ అతనికి కుమార్తె పుట్టినప్పటి నుంచి వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఆడపిల్ల పుట్టిందనే సాకుతో అదనపు కట్నం కావాలని వేధిస్తూ తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సిలింగ్​ చేసినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. తనకు న్యాయం చేయాలని వారం రోజులుగా ఆమె భర్త ఇంటి ముందు మౌనపోరాటం చేస్తుంది.

ఇదీ చూడండి : వైద్యం వికటించి బాలుడి మృతి... ఆసుపత్రి ఎదుట ఆందోళన

Intro:Tg_Hyd_60_26_Easy Money_DCP_PC_Ab_TS10011

హైదరాబాద్ : బాలానగర్
కష్టపడకుండా ఈసీ మణికి అలవాటు పడ్డ యువకుడు, అతడి తల్లి అరెస్ట్


Body:కోదాడకు చెందిన మహేష్.. అమాయక ప్రజలను, కొత్తగా బిజినెస్ ప్లాన్లు ఉన్నవాళ్ళతో సన్నిహితంగా ఉంటూ వారిని నమ్మించి వారి వద్ద నుండి కోట్ల రూపాయలు దండుకున్నాడు...తాజాగా చింతల్ కు చెందిన రాజేశ్వరి వద్ద 25 లక్షలు వసూలు చేసి కనిపించకుండా వెళ్లడంతో రాజేశ్వరి పోలీసులకు పిర్యాదు చేసింది..కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా పలువురు దగ్గర కొత్త బిజినెస్ లు పెడదమని వారి వద్ద నుండి కోటి రూపాయలు వసూలు చేసాడని దాదాపుగా 5 కోట్ల వరకు ఇలా వసూల్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని తిరిగి కస్టడీకి తీసుకుని మరోసారి విచారిస్తామన్నారు.
కష్టపడకుండా ఈజీ మనీకి అలవాటు పడ్డ యువకుడు మహేష్ 10వ తరగతి వరకే చదువున్నాడని డిసిపి పద్మజ వెల్లడించారు.. ఇతడికి సహకరించిన తల్లి లింగమ్మ ను కూడా అదుపులోకి తీసుకోగా సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.. మాయమాటలతో ఇరుగుపొరుగు వారిని నమ్మించి కోట్ల రూపాయలు తీసుకొని మొహం చాటేసిన యువకుడు మహేష్ ను అతనికి సహకరించిన తల్లిని రిమాండ్కు తరలించారు జీడిమెట్ల పోలీసులు..


Conclusion:బైట్ : పద్మజ, బాలానగర్ డిసిపి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.