సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కొమ్మాల నుంచి తుంగతుర్తికి వెళ్లే దారిలో… కోడూరు చెరువు నిండి అలుగు పోస్తోంది. దీనికి తోడు రహదారికి అడ్డంగా సంఘం వాగులో ఉద్ధృతంగా వరద ప్రవహిండం వల్ల ప్రమాదకరంగా మారింది. ఇక్కడ వంతెన నిర్మించాలని గ్రామస్తులు ఎంతో కాలంగా కోరుతున్నారు.
ప్రతి సంవత్సరం వాగు అధికంగా ప్రవహించడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ వంతెన నిర్మంచాలని కోరుతున్నారు.