ETV Bharat / state

ప్రకృతి వనం పేరు చెప్పి మా పొట్ట కొట్టారు.!

author img

By

Published : Dec 18, 2020, 1:13 PM IST

మెత్తటోణ్ని చూస్తే మొత్తబుద్ధవుతుందట. సూర్యాపేట జిల్లా రెవెన్యూ సిబ్బంది తీరు అలాగే ఉంది. కూలీ పనులకు వెళ్లి పొట్టపోసుకునే సామాన్యుల నుంచి భూమిని.. బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. పంట పండితేనే పండుగ చేసుకునే పరిస్థితుల్లో ఉన్న పేదల నుంచి ప్రగతి పేరిట నోటికాడి కూడు లాక్కున్నారు.

suryapet revenue officers grabbed shikham land for prakruthi vanam
సూర్యాపేటలో శిఖం భూముల్లో ప్రకృతి వనం

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి అధికారులు సామాన్యుల భూమిని స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న శిఖం భూముల్లో ఎవరిది ముట్టుకోకుండా.. పంట పండితే గానీ పబ్బం గడవని పరిస్థితుల్లో ఉన్న సామాన్యుల భూమిని బలవంతంగా ఆక్రమించారు. పోలీసుల బందోబస్త్​తో చుట్టూ రాళ్లు, కంచె వేసి మొక్కలు నాటారు.

నిబంధనలు తుంగలో తొక్కి

నిబంధనల ప్రకారం పల్లె ప్రకృతి వనానికి.. కేవలం ఐదు గుంటలు కావాలి. కానీ చివ్వెంల రెవెన్యూ అధికారులు పల్లె ప్రకృతి వనానికి 3.30 ఎకరాల భూమిని కేటాయించారు. వీకే పహాడ్, సేవాలాల్ తండా, లక్ష్మీనాయక్ తండాతోపాటు అనుబంధ గ్రామాలు పందిబండ తండా, బడి తండా, ఉనికి తండాలకు సంబంధించిన ప్రకృతి వనాలు ఒకేచోట ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో వీకేపహాడ్ భూమిని ఎంచుకున్నారు. గ్రామానికి చెందిన దూదేకుల కుటుంబాలు వారి ముత్తాతల కాలం నుంచి సర్వే నంబర్​ 239,246లలో ఉన్న 15 ఎకరాల భూమిలో సాగు చేస్తున్నారు. ప్రకృతి వనం కోసం చివ్వెంల రెవెన్యూ అధికారులు ఆ భూమిలో 3.30 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు.

అప్పుడు గుర్తించిన వారే..

రెవెన్యూ సిబ్బంది ఆక్రమించక ముందు.. ఆ భూమిని ఏటా ఒక్కో కుటుంబం సాగు చేస్తూ ఉండేది. ఈ ఏడు సాగు మొదలుపెడదామనుకునే లోపే రెవెన్యూ సిబ్బంది వచ్చి భూమి లాక్కొని మొక్కలు నాటారని రైతు పాచ్య వాపోయారు. నెలన్నర క్రితం భూమిని గుర్తించిన తహసీల్దారే ఇప్పుడు తమ భూమిని ప్రొక్లెయినర్లతో చదును చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

శిస్తు కట్టాం..

ముత్తాతల కాలం నుంచి ఆ భూమికి శిస్తు కట్టామని రైతులు తెలిపారు. ఆరు పల్లెల ప్రకృతి వనాలకు సంబంధించి 10 గుంటల చొప్పున లెక్కేసుకున్నా ఎకరంన్నర అవసరమవుతుందని, రెవెన్యూ అధికారులు 3.30 ఎకరాల భూమిని లాక్కున్నారని వాపోయారు. 239, 246 సర్వే నంబర్లలో ఉన్న భూముల్లోకి వెళ్లేందుకు.. అధికారులే మట్టిదారి వేసుకున్నారని చెప్పారు.

స్పందించరే..

ఇంత జరిగినా స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

సూర్యాపేటలో శిఖం భూముల్లో ప్రకృతి వనం

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి అధికారులు సామాన్యుల భూమిని స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న శిఖం భూముల్లో ఎవరిది ముట్టుకోకుండా.. పంట పండితే గానీ పబ్బం గడవని పరిస్థితుల్లో ఉన్న సామాన్యుల భూమిని బలవంతంగా ఆక్రమించారు. పోలీసుల బందోబస్త్​తో చుట్టూ రాళ్లు, కంచె వేసి మొక్కలు నాటారు.

నిబంధనలు తుంగలో తొక్కి

నిబంధనల ప్రకారం పల్లె ప్రకృతి వనానికి.. కేవలం ఐదు గుంటలు కావాలి. కానీ చివ్వెంల రెవెన్యూ అధికారులు పల్లె ప్రకృతి వనానికి 3.30 ఎకరాల భూమిని కేటాయించారు. వీకే పహాడ్, సేవాలాల్ తండా, లక్ష్మీనాయక్ తండాతోపాటు అనుబంధ గ్రామాలు పందిబండ తండా, బడి తండా, ఉనికి తండాలకు సంబంధించిన ప్రకృతి వనాలు ఒకేచోట ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో వీకేపహాడ్ భూమిని ఎంచుకున్నారు. గ్రామానికి చెందిన దూదేకుల కుటుంబాలు వారి ముత్తాతల కాలం నుంచి సర్వే నంబర్​ 239,246లలో ఉన్న 15 ఎకరాల భూమిలో సాగు చేస్తున్నారు. ప్రకృతి వనం కోసం చివ్వెంల రెవెన్యూ అధికారులు ఆ భూమిలో 3.30 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు.

అప్పుడు గుర్తించిన వారే..

రెవెన్యూ సిబ్బంది ఆక్రమించక ముందు.. ఆ భూమిని ఏటా ఒక్కో కుటుంబం సాగు చేస్తూ ఉండేది. ఈ ఏడు సాగు మొదలుపెడదామనుకునే లోపే రెవెన్యూ సిబ్బంది వచ్చి భూమి లాక్కొని మొక్కలు నాటారని రైతు పాచ్య వాపోయారు. నెలన్నర క్రితం భూమిని గుర్తించిన తహసీల్దారే ఇప్పుడు తమ భూమిని ప్రొక్లెయినర్లతో చదును చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

శిస్తు కట్టాం..

ముత్తాతల కాలం నుంచి ఆ భూమికి శిస్తు కట్టామని రైతులు తెలిపారు. ఆరు పల్లెల ప్రకృతి వనాలకు సంబంధించి 10 గుంటల చొప్పున లెక్కేసుకున్నా ఎకరంన్నర అవసరమవుతుందని, రెవెన్యూ అధికారులు 3.30 ఎకరాల భూమిని లాక్కున్నారని వాపోయారు. 239, 246 సర్వే నంబర్లలో ఉన్న భూముల్లోకి వెళ్లేందుకు.. అధికారులే మట్టిదారి వేసుకున్నారని చెప్పారు.

స్పందించరే..

ఇంత జరిగినా స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

సూర్యాపేటలో శిఖం భూముల్లో ప్రకృతి వనం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.