ETV Bharat / state

'అసలైన సూత్రధారులను వదిలేస్తున్నారు' - ration rice caught by suryapet police

లాక్​డౌన్​లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం పంపిణీ చేస్తోన్నరేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు దోచేస్తున్నారు.

suryapet police caught ration rice while transporting to hyderabad
సూర్యాపేట జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : May 16, 2020, 10:58 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ నియోజకవర్గం అక్రమ దందాలకు అడ్డాగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున మఠంపల్లి నుంచి హైదరాబాద్​ తరలిస్తోన్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

సుమారు 165 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా గతంలో రేషన్, గుట్కా దందాల్లో పీడీ యాక్ట్ కింద కేసు నమోదైన ఓ వ్యక్తి నడిపిస్తున్నట్లు వెల్లడించారు.

ఓ రాజకీయ నేత అండదండలతోనే ఈ దందా నడుస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రతిసారి డ్రైవర్లు, కూలీల పైన కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని, సూత్రధారులను పట్టుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ నియోజకవర్గం అక్రమ దందాలకు అడ్డాగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున మఠంపల్లి నుంచి హైదరాబాద్​ తరలిస్తోన్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

సుమారు 165 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా గతంలో రేషన్, గుట్కా దందాల్లో పీడీ యాక్ట్ కింద కేసు నమోదైన ఓ వ్యక్తి నడిపిస్తున్నట్లు వెల్లడించారు.

ఓ రాజకీయ నేత అండదండలతోనే ఈ దందా నడుస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రతిసారి డ్రైవర్లు, కూలీల పైన కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని, సూత్రధారులను పట్టుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.