Suryapet Medical Employee Murder Case : సూర్యాపేటలో ఆదివారం జరిగిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి హత్య కేసును పోలీసులు చేధించారు. ఆస్తి కోసం ఆమె సోదరుడే హత్య చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పట్టణంలోని సీతారాంపురానికి చెందిన అనుములపురి స్వరూపారాణి ఈ నెల 5న తలకు తీవ్ర గాయమై ముఖం, ఛాతి పాక్షికంగా కాలిపోయి స్నానపు గదిలో రక్తపు మడుగులో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటానస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. : పెన్పహాడ్ మండలం అనాజిపురం గ్రామానికి చెందిన రాజకుమార్.. తన చెల్లెలు స్వరూపారాణి వద్ద పదేళ్ల క్రితం తన తండ్రి పేరున ఉన్న 300 గజాల ప్లాట్ దస్త్రాలు కుదువపెట్టి రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని, ప్లాట్ కాగితాలు తిరిగి ఇవ్వాలంటూ ఆరు నెలలుగా సోదరుడు అడుగుతున్నాడు. 'తండ్రి సంపాదించిన ఆస్తిలో తనకూ సమాన వాటా ఉంటుందని, ఇచ్చిన డబ్బులకు వడ్డీ లెక్క కడితే నీ వాటాకు లెక్క సరిపోతుందని' సోదరి స్వరూపారాణి బదులు చెబుతూ వస్తోంది. ప్లాట్ కాగితాలు ఇవ్వకపోవడంతో చెల్లెలిపై కోపం పెంచుకున్న సోదరుడు రాజకుమార్.. ఆమెను హత్య చేసి కాగితాలతో పాటు ఆమె వద్దనున్న బంగారాన్ని అపహరించాలని నిర్ణయించుకున్నాడు.
అందులో భాగంగానే ఈనెల 5న సాయంత్రం సమయంలో సీతారాంపురంలోని సోదరి ఇంటికి వెళ్లాడు. ఆమె ఒంటరిగా ఉందని తెలిసిన తర్వాత ఇనుప కడ్డీతో తలపై విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె మెడకున్న పుస్తెలతాడు తీసుకొని, అక్కడున్న వస్త్రాలకు నిప్పంటించి ముఖంపై వేసి, విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు నమ్మించాలని ప్రయత్నించాడు. అనంతరం అక్కడి నుంచి తిరిగి తన స్వగ్రామానికి వెళ్లాడు.
A woman dealer brutally murdered in Peddapalli district : పెద్దపల్లి జిల్లాలో మహిళా డీలర్ దారుణహత్య
Medical Employee Murder Case in Suryapet : హత్య జరగడానికి ముందు రాజ కుమార్.. మృతురాలి ఇంటికి వచ్చి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సమీపంలోని సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సూర్యాపేట ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్సై మహేంద్రనాథ్, హెడ్కానిస్టేబుల్ కరుణాకర్, కృష్ణ, సైదులు, కానిస్టేబుల్స్ ఆనంద్, సైదులు, మధును ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించి రివార్డు అందజేశారు.
ఇదీ జరిగింది : సూర్యాపేట జిల్లా కేంద్రం సీతారాంపురానికి చెందిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగిని అనుములపురి స్వరూపారాణి (53) ఆదివారం సాయంత్రం హత్యకు గురయ్యారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె తలకు తీవ్ర గాయమై ముఖం, ఛాతి పాక్షికంగా కాలిపోయి స్నానపు గదిలో రక్తపు మడుగులో పడి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పెన్పహాడ్ మండలం అనాజ్పురం గ్రామానికి చెందిన స్వరూపారాణి కొన్నేళ్లుగా సీతారాంపురంలోని సొంత ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె కాసరబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పబ్లిక్ హెల్త్ నర్స్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం స్వరూపారాణి ఇంట్లో నుంచి పొగలు వస్తున్నట్లు గుర్తించిన స్థానికులు.. ఇంట్లోకి వెళ్లి పరిశీలిచడంతో హత్య విషయం వెలుగు చూసింది.
Young Woman Murder in Champapet : చంపాపేట్ యువతి హత్య కేసులో వీడిన మిస్టరీ.. అసలు ఏం జరిగిందంటే..?