రోజూ ఆన్లైన్ తరగతులు తప్పనిసరిగా వినాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల విద్యాధికారి బోయిని లింగయ్య సూచించారు. గానుగుబండ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదివే దివ్యాంగుల ఇళ్లకు సోమవారం వెళ్లి ఆన్లైన్ తరగతులను పరిశీలించారు. ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
పిల్లలు ఆన్లైన్ తరగతులు వింటున్నారా... లేదా అని తల్లిదండ్రులు నిత్యం పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గుడిపాటి అనిత, ఐఈఆర్టీ ఉపేందర్, మధుకర్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆర్జిత సేవలు ప్రారంభం