సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుడుగుంట్ల పాలెం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి లక్ష్మమ్మ అనే మహిళకు గాయాలయ్యాయి. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల కోసం నేరేడుచర్ల వెళ్లి వస్తుండగా... ఎదురుగా వస్తున్న గేదెలు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టాయి. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి.
ఇది గమనించిన స్థానికులు పాలకీడు ఎస్సైకి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రురాలిని పోలీసు వాహనంలో తీసుకెళ్లి వైద్యం చేయించి మానవత్వన్ని చాటుకున్నారు.
ఇవీ చూడండి: గుంజిళ్లు తీయించి.. కరోనా ప్రమాణం చేయించి..