సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలోని కిరాణా దుకాణలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.లక్షా ఆరు వేలు ఉంటుందని వెల్లడించారు.
సింగారపు సైదులు, సింగారపు కోటయ్య అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వం నిషేధించిన గుట్కా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.