సూర్యాపేట జిల్లా పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన మాదగోని మహేష్ గౌడ్ హైదరాబాద్ నాచారంలో సర్కిల్ ఇనిస్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ వలస కూలీల బాధలు గమనించి నిత్యావసరాలు అందించారు. హైదరాబాద్లో వారు పడుతున్న బాధలు సొంతూరి వైపుకు నడిపించాయి. నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న పేదలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.
మై విలేజ్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాల చేపట్టిన ఈ పోలీస్ అధికారి... రెండు లక్షల రూపాయలతో పది రకాల వస్తువులు కొని సొంతూరికి చేరుకున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా 300 కుటుంబాలకు పంపిణీ చేశారు. కన్నతల్లిని, జన్మనిచ్చిన నేలకు రుణపడి ఉంటానంటున్నారు సీఐ మహేష్ గౌడ్.
ఇవీ చూడండి: అమ్మా.. నీ మనసు వెన్న...