ETV Bharat / state

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సీఐ - పిన్నాయిపాలెంలో సరకుల పంపిణీ

ఎక్కడ ఉన్నా... కన్న ఊరుపై మమకారం తగ్గలేదు. కరోనా కష్టకాలంలో... సొంతూరిలో పేదలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. 300 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి దాతృత్వం చాటుకున్నారు ఓ సర్కిల్ ఇన్స్​పెక్టర్.

nacharam circle inspecter mahesh goud distribute groceries in pinnayipalem
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సీఐ
author img

By

Published : May 10, 2020, 3:06 PM IST

సూర్యాపేట జిల్లా పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన మాదగోని మహేష్ గౌడ్ హైదరాబాద్ నాచారంలో సర్కిల్ ఇనిస్పెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ వలస కూలీల బాధలు గమనించి నిత్యావసరాలు అందించారు. హైదరాబాద్​లో వారు పడుతున్న బాధలు సొంతూరి వైపుకు నడిపించాయి. నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న పేదలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

మై విలేజ్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాల చేపట్టిన ఈ పోలీస్ అధికారి... రెండు లక్షల రూపాయలతో పది రకాల వస్తువులు కొని సొంతూరికి చేరుకున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా 300 కుటుంబాలకు పంపిణీ చేశారు. కన్నతల్లిని, జన్మనిచ్చిన నేలకు రుణపడి ఉంటానంటున్నారు సీఐ మహేష్ గౌడ్.

సూర్యాపేట జిల్లా పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన మాదగోని మహేష్ గౌడ్ హైదరాబాద్ నాచారంలో సర్కిల్ ఇనిస్పెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ వలస కూలీల బాధలు గమనించి నిత్యావసరాలు అందించారు. హైదరాబాద్​లో వారు పడుతున్న బాధలు సొంతూరి వైపుకు నడిపించాయి. నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న పేదలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

మై విలేజ్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాల చేపట్టిన ఈ పోలీస్ అధికారి... రెండు లక్షల రూపాయలతో పది రకాల వస్తువులు కొని సొంతూరికి చేరుకున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా 300 కుటుంబాలకు పంపిణీ చేశారు. కన్నతల్లిని, జన్మనిచ్చిన నేలకు రుణపడి ఉంటానంటున్నారు సీఐ మహేష్ గౌడ్.

ఇవీ చూడండి: అమ్మా.. నీ మనసు వెన్న...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.