దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ... కదలలేనిస్థితిలో ఉన్నరోగులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆలన ప్యాలియేటివ్ హోమ్ కేర్ సేవలు ఎంతగానో ఉపకరిస్తాయని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ ప్రాంతీయ వైద్యశాలలో ఆలన ప్యాలియేటివ్ హోమ్ కేర్ సేవల వాహనాన్ని ప్రారంభించారు.
ఆలన వాహనంలో ఒక డాక్టర్, స్టాఫ్నర్స్ ఉంటారని జిల్లా వైద్యారోగ్య అధికారి శ్రీనివాసరాజు తెలిపారు. ప్రతిరోజు నియోజకవర్గంలోని లింగగిరి, గరిడేపల్లి, కల్మలచెరువు, నేరేడుచర్ల, పెంచికల్ దిన్న మండలాల పరిధిలోని క్యాన్సర్, కిడ్నీ, పక్షవాత వంటి దీర్ఘకాలిక రోగులకు సేవలు అందిస్తాయని వివరించారు.
ఇదీ చదవండి: పునాది రాయితో పులకించిన అయోధ్య