ETV Bharat / state

'అర్హత కలిగిన రైతులు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి' - హుజూర్​నగర్​ ఎమ్మెల్యే వార్తలు

రైతు బీమా పథకానికి అర్హత కలిగిన రైతులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. సంబంధిత పత్రాలను ఈ నెల 18లోపు మండల అధికారులకు సమర్పించాలని సూచించారు.

Eligible farmers should apply for farmer insurance scheme
'అర్హత కలిగిన రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి'
author img

By

Published : Sep 15, 2020, 6:14 PM IST

రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం రైతు బీమా పథకం అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేర్కొన్నారు. జూన్ 6, 2020 తేదీకి ముందు కొత్త పట్టా పాసు పుస్తకాలు తీసుకున్న రైతులు, ఈ పథకానికి అర్హత కలిగి ఉండి, దరఖాస్తు చేసుకొని రైతులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఇందుకు రైతులు వారి కొత్త పాసు పుస్తకం జిరాక్స్, ఎమ్మార్వో కార్యాలయం నుంచి డ్రాఫ్ట్ కాపీ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్​లను మండల వ్యవసాయ అధికారులకు ఈనెల 18లోపు సమర్పించాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం రైతు బీమా పథకం అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేర్కొన్నారు. జూన్ 6, 2020 తేదీకి ముందు కొత్త పట్టా పాసు పుస్తకాలు తీసుకున్న రైతులు, ఈ పథకానికి అర్హత కలిగి ఉండి, దరఖాస్తు చేసుకొని రైతులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఇందుకు రైతులు వారి కొత్త పాసు పుస్తకం జిరాక్స్, ఎమ్మార్వో కార్యాలయం నుంచి డ్రాఫ్ట్ కాపీ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్​లను మండల వ్యవసాయ అధికారులకు ఈనెల 18లోపు సమర్పించాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.