ETV Bharat / state

హుజూర్​నగర్​ ఎక్సైజ్​ సీఐపై వేటు!

author img

By

Published : Oct 16, 2019, 5:24 AM IST

Updated : Oct 16, 2019, 7:59 AM IST

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల పోరు అక్కడి అధికారుల పాలిట శాపంగా మారింది. వారి ఉద్యోగాలకే ఎసరు వచ్చేలా పరిస్థితి నెలకొంది. తాజాగా హుజూర్​నగర్​ ఎక్సైజ్​ సీఐ శ్రీనివాస్​ను సస్పెండ్​ చేయాలని ఈసీ.. ఎక్సైజ్​ కమిషనర్​కు లేఖ పంపింది.

హుజూర్​నగర్​ ఎక్సైజ్​ సీఐని సస్పెండ్​ చేయాలని ఈసీ లేఖ

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ ఉప ఎన్నిక పోరు పార్టీల మధ్య తీవ్రంగా ఉంది. దీనితో ఇక్కడ అధికారులు విధులు నిర్వర్తించడం కష్టంగా మారింది. హుజూర్​నగర్​ ఎక్సైజ్​ సీఐ శ్రీనివాస్​పై తాజాగా ఫిర్యాదులు రావడం వల్ల ఎన్నికల సంఘం అతన్ని సస్పెండ్​ చేయాలని సిఫారసు చేస్తూ ఎక్సైజ్​ కమిషనర్​కు లేఖ పంపింది. సీఐ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో ఈనెల 11న 200 కాటన్ల మద్యం పట్టుబడింది. ఎన్నికల నియామావళి అమలు ఉన్న ప్రాంతంలో అక్రమంగా లిక్కర్​ రావడం అడ్డుకోవడంలో విఫలమయ్యారని, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఈసీకి ప్రతిపక్ష పార్టీ నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ ఆరోపణలతో సీఐ శ్రీనివాస్​ను విధుల నుంచి తొలగించాలని ఈసీ సిఫారసు చేసింది. ఈ సిఫారసుపై స్పందించిన ఎక్సైజ్​ కమిషనర్​ సీఐ శ్రీనివాస్​ను నల్గొండ జిల్లా ప్రొహిబిషన్​ ఎక్సైజ్​ ఆఫిసర్​కు సరెండర్​ చేశారు. అతనిపై వచ్చిన ఆరోపణలపై విచారించి వారంలోగా నివేదిక ఇవ్వాలని కమిషనర్​.. డిప్యూటి కమిషనర్​కు ఆదేశాలిచ్చారు. శ్రీనివాస్​ స్థానంలో నల్గొండ ఎన్​ఫోర్సుమెంట్​ సీఐ భరత్​ భూషణ్​కు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ ఉప ఎన్నిక పోరు పార్టీల మధ్య తీవ్రంగా ఉంది. దీనితో ఇక్కడ అధికారులు విధులు నిర్వర్తించడం కష్టంగా మారింది. హుజూర్​నగర్​ ఎక్సైజ్​ సీఐ శ్రీనివాస్​పై తాజాగా ఫిర్యాదులు రావడం వల్ల ఎన్నికల సంఘం అతన్ని సస్పెండ్​ చేయాలని సిఫారసు చేస్తూ ఎక్సైజ్​ కమిషనర్​కు లేఖ పంపింది. సీఐ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో ఈనెల 11న 200 కాటన్ల మద్యం పట్టుబడింది. ఎన్నికల నియామావళి అమలు ఉన్న ప్రాంతంలో అక్రమంగా లిక్కర్​ రావడం అడ్డుకోవడంలో విఫలమయ్యారని, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఈసీకి ప్రతిపక్ష పార్టీ నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ ఆరోపణలతో సీఐ శ్రీనివాస్​ను విధుల నుంచి తొలగించాలని ఈసీ సిఫారసు చేసింది. ఈ సిఫారసుపై స్పందించిన ఎక్సైజ్​ కమిషనర్​ సీఐ శ్రీనివాస్​ను నల్గొండ జిల్లా ప్రొహిబిషన్​ ఎక్సైజ్​ ఆఫిసర్​కు సరెండర్​ చేశారు. అతనిపై వచ్చిన ఆరోపణలపై విచారించి వారంలోగా నివేదిక ఇవ్వాలని కమిషనర్​.. డిప్యూటి కమిషనర్​కు ఆదేశాలిచ్చారు. శ్రీనివాస్​ స్థానంలో నల్గొండ ఎన్​ఫోర్సుమెంట్​ సీఐ భరత్​ భూషణ్​కు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు.

Intro:Body:Conclusion:
Last Updated : Oct 16, 2019, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.