సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మండల పరిషత్ కార్యాలయంలో తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్.. 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పోతరాజు రజిని, ఎమ్మార్వో హరిచంద్ర ప్రసాద్, ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలి రవీందర్ పాల్గొన్నారు.
ప్రతి పేదింటి ఆడపిల్ల తమ తోబుట్టువేనని... ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో దేశంలో మొట్టమొదటిసారిగా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు. తెలంగాణలో ఉన్న 18సంవత్సరాలు పూర్తైన ప్రతి ఆడపడచు పెళ్లికి ఈ పథకం వర్తిస్తోందని కులాలు, మతాలతో సంబంధం లేకుండా అందరూ వినియోగించుకోవాలని కోరారు.
- ఇవీ చూడండి: ఎప్పటిలాగే .. పాతపాటే .. మరోసారి మొండి చెయ్యే!