ETV Bharat / state

గుజరాత్ నుంచి తీసుకొస్తారు - తెలుగు రాష్ట్రాల్లో అమ్మేస్తారు - CHILDREN SELLING GANG ARREST IN HYD

చైతన్యపురిలో చిన్నపిల్లలను అమ్ముతున్న ముఠా అరెస్టు - గుజరాత్ నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్న నిందితులు - మల్కాజ్​గిరి ఎస్‌వోటీ సాయంతో ముఠాను పట్టుకున్న చైతన్యపురి పోలీసులు

Gang Selling Children Arrested in Hyderabad
Gang Selling Children Arrested in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2025, 4:39 PM IST

Updated : Feb 25, 2025, 5:30 PM IST

Gang Selling Children Arrested in Hyderabad : చైతన్యపురిలో చిన్నపిల్లను అమ్ముతున్న ముఠా బండాగారం బట్టబయలైంది. గుజరాత్​ నుంచి చిన్నారులను తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న చైతన్యపురి పోలీసులు, మల్కాజ్​గిరి ఎస్​వోటీ సాయంతో ముఠాను పట్టుకున్నారు. నలుగురు చిన్నారులను రక్షించి 11 మంది నిందితులను అరెస్టు చేశారు.

నిందితులు కోలాక కృష్ణవేణి, దీప్తి, గౌతం సావిత్రి దేవి, శ్రవణ్‌కుమార్‌, ఆమ్‌ గోత్‌ శారదా, సంపత్‌కుమార్‌గా గుర్తించారు. వీరి దగ్గరి నుంచి పిల్లల్ని కొనుగోలు చేసిన నాగ వెంకట పవన్‌ భగవాన్‌, రమా శ్రావణి, వినయ్‌ కుమార్‌, స్వాతి, రమేశ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 11 ఫోన్లు, రూ.5వేలు స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.

"వీళ్లంత సోషల్​ మీడియా ద్వారా ఒక్కటై ఇలాంటి ఆక్రమాలు మొదలుపెట్టారు. అక్కడ పుట్టిన పిల్లలను అమ్మడానికి గుజరాత్​ నుంచి తీసుకువచ్చి, తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నారు. ఒక్క చిన్నారిని విక్రయించేందుకు సుమారు రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షల వరకు తీసుకుంటున్నారు. ఇద్దరు మహిళలు కలిసి తెలుగు రాష్ట్రాల్లో దీన్ని నడిపిస్తున్నారు. పిల్లలను అమ్మే తల్లిదండ్రులకు తీసుకునే వారికి అసలు పరిచయం ఉండదు. ఇలా అక్రమంగా డబ్బులిచ్చి పిల్లలు కొంటున్నవారిని కూడా మేము నేరస్థులుగా పరిగణిస్తున్నాం. వారందరిపై చర్యలు తీసుకుంటాం" - సుధీర్​ బాబు, రాచకొండ సీపీ

నీకు బైక్​ కావాలా స్కూటీయా? - ఇవి వాహనాలు కాదు చిన్నారుల విక్రయానికి కోడ్​వర్డ్స్​ - Child Trafficking Case in Hyderabad

కోడ్​ భాషలో సంభాషణ - సొంత తల్లిలా నటించే మహిళలు - చిన్నారుల అక్రమ రవాణాలో విస్తుపోయే విషయాలు - CHILD TRAFFICKING GANG IN HYDERABAD

Gang Selling Children Arrested in Hyderabad : చైతన్యపురిలో చిన్నపిల్లను అమ్ముతున్న ముఠా బండాగారం బట్టబయలైంది. గుజరాత్​ నుంచి చిన్నారులను తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న చైతన్యపురి పోలీసులు, మల్కాజ్​గిరి ఎస్​వోటీ సాయంతో ముఠాను పట్టుకున్నారు. నలుగురు చిన్నారులను రక్షించి 11 మంది నిందితులను అరెస్టు చేశారు.

నిందితులు కోలాక కృష్ణవేణి, దీప్తి, గౌతం సావిత్రి దేవి, శ్రవణ్‌కుమార్‌, ఆమ్‌ గోత్‌ శారదా, సంపత్‌కుమార్‌గా గుర్తించారు. వీరి దగ్గరి నుంచి పిల్లల్ని కొనుగోలు చేసిన నాగ వెంకట పవన్‌ భగవాన్‌, రమా శ్రావణి, వినయ్‌ కుమార్‌, స్వాతి, రమేశ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 11 ఫోన్లు, రూ.5వేలు స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.

"వీళ్లంత సోషల్​ మీడియా ద్వారా ఒక్కటై ఇలాంటి ఆక్రమాలు మొదలుపెట్టారు. అక్కడ పుట్టిన పిల్లలను అమ్మడానికి గుజరాత్​ నుంచి తీసుకువచ్చి, తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నారు. ఒక్క చిన్నారిని విక్రయించేందుకు సుమారు రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షల వరకు తీసుకుంటున్నారు. ఇద్దరు మహిళలు కలిసి తెలుగు రాష్ట్రాల్లో దీన్ని నడిపిస్తున్నారు. పిల్లలను అమ్మే తల్లిదండ్రులకు తీసుకునే వారికి అసలు పరిచయం ఉండదు. ఇలా అక్రమంగా డబ్బులిచ్చి పిల్లలు కొంటున్నవారిని కూడా మేము నేరస్థులుగా పరిగణిస్తున్నాం. వారందరిపై చర్యలు తీసుకుంటాం" - సుధీర్​ బాబు, రాచకొండ సీపీ

నీకు బైక్​ కావాలా స్కూటీయా? - ఇవి వాహనాలు కాదు చిన్నారుల విక్రయానికి కోడ్​వర్డ్స్​ - Child Trafficking Case in Hyderabad

కోడ్​ భాషలో సంభాషణ - సొంత తల్లిలా నటించే మహిళలు - చిన్నారుల అక్రమ రవాణాలో విస్తుపోయే విషయాలు - CHILD TRAFFICKING GANG IN HYDERABAD

Last Updated : Feb 25, 2025, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.