సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని గానుగుబండ గ్రామానికి చెందిన ఎనగందుల కమలాకర్ అనారోగ్యంతో బాధపడుతన్నాడు. చికిత్సకు అయిన ఖర్చును తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సహకారంతో సీఎం సహాయనిధి కింద రూ. 20 వేల చెక్కును తెరాస మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి సైదులుకు అందించారు.
తెరాస ప్రభుత్వం.. పేదల ప్రభుత్వమని చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనమని గుడిపాటి సైదులు అన్నారు. పేదవాడికి దూరమైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాంచంద్రారెడ్డి, తెరాస జిల్లా నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'ఆ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం'