సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని రూ.43వేల నగదు, నాలుగు చరవాణీలు స్వాధీనం చేసకున్నారు. ఓ నివాస గృహంలో ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు పేకాట ఆడుతున్నారన్న సమాచారం డయల్ 100కు వచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు తిరుమలగిరి ఎస్సై డానియల్ తెలిపారు.
ఇదీ చూడండి: పెళ్లి ఖర్చులు సీఎంఆర్ఎఫ్కు.. వరుడి నిర్ణయం