ETV Bharat / state

'మూఢ నమ్మకాలతో వ్యక్తి మృతి'

మూఢనమ్మకాలతో రోగం తగ్గిపోతుందని మూడు రోజులు వైద్యసేవలు తీసుకోకుండా చర్చిలో ఉండి ప్రాణం కోల్పోయిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జరిగింది.

author img

By

Published : May 27, 2019, 12:32 AM IST

మూఢ నమ్మకాలతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన రాజేష్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతన్నాడు. త్వరగా తన వ్యాధి నయం కావాలని తల్లి గిరిశెట్టి మంగమ్మ, మేనత్త ఎల్లమ్మ టీవీలో వచ్చిన ప్రకటనతో ప్రభావితమయ్యారు. చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తే వ్యాధి నయమవుతుందనే మూఢ నమ్మకంతో బెల్లంపల్లి పట్టణంలోని చర్చికి గురువారం వెళ్లారు. అక్కడ మూడు రోజులపాటు చర్చిలో ఉండటం వల్ల శనివారం అతని ఆరోగ్యం క్షీణించింది.
విషయం చర్చి నిర్వహకులకు తెలుపగానే వారు ఆసుపత్రికి​ తీసుకెళ్తామని చర్చి వాహనంలో కొన ఊపిరితో ఉన్న రాజేష్​ను వాహనంలో తరలించారు. నాలుగు గంటలపాటు బెల్లంపల్లి పరిసరాల్లో తిప్పుతూ కాలయాపన చేశారు. బాధితులకు అనుమానం వచ్చి వాహనాన్ని ఆపమని ప్రాధేయపడినా ఆపకపోవడం వల్ల కేకలు వేశారు. స్థానికులు వాహనాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ అసుపత్రికి తరలించగా అప్పటికే రాజేష్ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న కాసిపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మూఢ నమ్మకాలతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి


ఇవీ చూడండి : మాతృమూర్తి ఆశీర్వాదాలు తీసుకున్న మోదీ

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన రాజేష్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతన్నాడు. త్వరగా తన వ్యాధి నయం కావాలని తల్లి గిరిశెట్టి మంగమ్మ, మేనత్త ఎల్లమ్మ టీవీలో వచ్చిన ప్రకటనతో ప్రభావితమయ్యారు. చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తే వ్యాధి నయమవుతుందనే మూఢ నమ్మకంతో బెల్లంపల్లి పట్టణంలోని చర్చికి గురువారం వెళ్లారు. అక్కడ మూడు రోజులపాటు చర్చిలో ఉండటం వల్ల శనివారం అతని ఆరోగ్యం క్షీణించింది.
విషయం చర్చి నిర్వహకులకు తెలుపగానే వారు ఆసుపత్రికి​ తీసుకెళ్తామని చర్చి వాహనంలో కొన ఊపిరితో ఉన్న రాజేష్​ను వాహనంలో తరలించారు. నాలుగు గంటలపాటు బెల్లంపల్లి పరిసరాల్లో తిప్పుతూ కాలయాపన చేశారు. బాధితులకు అనుమానం వచ్చి వాహనాన్ని ఆపమని ప్రాధేయపడినా ఆపకపోవడం వల్ల కేకలు వేశారు. స్థానికులు వాహనాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ అసుపత్రికి తరలించగా అప్పటికే రాజేష్ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న కాసిపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మూఢ నమ్మకాలతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి


ఇవీ చూడండి : మాతృమూర్తి ఆశీర్వాదాలు తీసుకున్న మోదీ

Intro:tg_wgl_38_06_bjp_pracharam_ab_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం లోని మైలారం లో భాజపా ఎంపీటీసీ అభ్యర్థి గాడిపెళ్లి రాజు ను గెలిపించాలని కోరుతూ భాజపా వరంగల్ గ్రామీణ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. గ్రామం లోని ఇంటింటికి వెళ్లి తమ ఓటును వెయ్యలని కోరారు. భాజపా అభ్యర్థులు గెలిస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెదగోని సోమయ్య, జడ్పీటీసీ అభ్యర్థి కర్ర శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు గడ్డం నరేందర్, నాయకులు తాళ్ల సందీప్ రెడ్డి, ప్రశాంత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


Body:s


Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.