సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భాజపా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు ఇనుగాల పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేంద్ర నిధులతో పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తూ... దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో హుస్నాబాద్ పుర కార్యాలయంపై కాషాయ జెండా ఎగరాలని ఆకాక్షించారు. ఆ దిశగా పట్టణంలోని ప్రతీ కార్యకర్త పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలు నిర్వహించాలని ఆదేశించారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
ఇవీ చూడండి : తెరాసలో మేయర్ పదవికి రూ.5 కోట్లు: రేవంత్ రెడ్డి