సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదులనగర్లో తాగునీటి కోసం గ్రామపంచాయతీ పాలకవర్గం బోరుబావిని తవ్వించింది. మొదట్లో నీరు మాములుగానే వచ్చింది. గతంలో కురిసిన వర్షాలకు భూగర్భజలాలు బాగా పైకి వచ్చాయి. చెరువులు కుంటలు నిండాయి.
దీంతో చెరువు సమీపంలో తవ్వించిన బోరుబావి కేసింగ్ నుంచి నీరు పైకి ఉబికి వస్తున్నాయి. విషయం తెలిసిన గ్రామస్థులు వచ్చి చూసి వెళుతున్నారు. ఆ నీరు మొత్తం పక్కనే ఉన్న చెరువులోకి వెళ్లడంతో నీటిమట్టం బాగా పెరిగే అవకాశం ఉందని వారు చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి: కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం