ETV Bharat / state

సాంప్రదాయంగా డబుల్ బెడ్ రూం గృహ ప్రవేశాలు - HARISH TOUR

సిద్దిపేట జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు సాంప్రదాయంగా నూతన గృహ ప్రవేశం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హారీశ్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
author img

By

Published : Dec 13, 2019, 7:21 PM IST

సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. గ్రామంలో రూ.1.57 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 25 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహ ప్రవేశాలు ఘనంగా జరిగాయి. సాంప్రదాయం ప్రకారం వైదిక పూజా కార్యక్రమాలు చేపట్టి పండుగ వాతావరణంలో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు జరుపుకున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్, జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

నూతన గృహాలు బాగున్నాయా ?

గృహ ప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు మంత్రి మిఠాయిలు తినిపించారు. కొత్త ఇళ్లు ఎలా ఉన్నాయంటూ లబ్ధిదారులతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు. రూ 14.80 లక్షల వ్యయంతో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్మించిన రెండు అదనపు గదులను, అనంతరం డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. గ్రామంలో రూ. 30లక్షల వ్యయంతో నిర్మించనున్న కేజీబీవీ బాలికల విద్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అత్యంత వెనుకబడిన వారికే కేటాయించాం...

రాఘవాపూర్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లోని అత్యంత నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించామని వివరించారు. డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు ఓ కమిటీ ‌వేసుకుని, ప్రతీ ఇంటి నుంచి కొంత మొత్తం వసూలు‌ చేసుకోవాలని సూచించారు. ఆ డబ్బును కమిటీ ఆధ్వర్యంలో కాలనీ అభివృద్ధికి వెచ్చించాలని కోరారు. కాళేశ్వరం నీటి ద్వారా చెరువులు నింపి.. రెండు పంటలు పండించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యాసంగి పంటకు కాళేశ్వరం నీళ్లు తెస్తామన్నారు. రోడ్ల నిర్మాణం పనులు దశల వారీగా చేపడతామన్నారు.

సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఇవీ చూడండి : ఈ నెల 23 నుంచి హైదరాబాద్​లో బుక్​ఫెయిర్

సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. గ్రామంలో రూ.1.57 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 25 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహ ప్రవేశాలు ఘనంగా జరిగాయి. సాంప్రదాయం ప్రకారం వైదిక పూజా కార్యక్రమాలు చేపట్టి పండుగ వాతావరణంలో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు జరుపుకున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్, జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

నూతన గృహాలు బాగున్నాయా ?

గృహ ప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు మంత్రి మిఠాయిలు తినిపించారు. కొత్త ఇళ్లు ఎలా ఉన్నాయంటూ లబ్ధిదారులతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు. రూ 14.80 లక్షల వ్యయంతో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్మించిన రెండు అదనపు గదులను, అనంతరం డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. గ్రామంలో రూ. 30లక్షల వ్యయంతో నిర్మించనున్న కేజీబీవీ బాలికల విద్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అత్యంత వెనుకబడిన వారికే కేటాయించాం...

రాఘవాపూర్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లోని అత్యంత నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించామని వివరించారు. డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు ఓ కమిటీ ‌వేసుకుని, ప్రతీ ఇంటి నుంచి కొంత మొత్తం వసూలు‌ చేసుకోవాలని సూచించారు. ఆ డబ్బును కమిటీ ఆధ్వర్యంలో కాలనీ అభివృద్ధికి వెచ్చించాలని కోరారు. కాళేశ్వరం నీటి ద్వారా చెరువులు నింపి.. రెండు పంటలు పండించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యాసంగి పంటకు కాళేశ్వరం నీళ్లు తెస్తామన్నారు. రోడ్ల నిర్మాణం పనులు దశల వారీగా చేపడతామన్నారు.

సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఇవీ చూడండి : ఈ నెల 23 నుంచి హైదరాబాద్​లో బుక్​ఫెయిర్

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_71_13_HARISH TOUR_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన గ్రామంలో రూ.1.57.25కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 25 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహా ప్రవేశాలు ఘనంగా జరిగాయి. సంప్రదాయం ప్రకారం ప్రతి ఇంటికి మామిడి తోరణాలు కట్టి, ఇంట్లో పుణ్యహావచనం, వైదిక పూజా కార్యక్రమాలు చేపట్టి పండుగ వాతావరణంలో లబ్ధిదారులు గృహా ప్రవేశాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్, జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మలు ముఖ్య అతిథిలుగా హాజరై గృహా ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటా గృహా ప్రవేశాలు జరిపి లబ్ధిదారులకు మిఠాయిలు తినిపించారు. కొత్త ఇళ్లు మంచిగుందా అమ్మా అంటూ లబ్ధిదారులతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు. రూ.14.80లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్మించిన రెండు అదనపు గదులను అనంతరం డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. గ్రామంలో రూ.30లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కేజీబీవీ-కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వాయిస్ ఓవర్: మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..... రాఘవాపూర్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దశల వారీగా ఇంకా అభివృద్ధి చేస్తాం.రాష్ట్రంలో అతి ఎక్కువ కుల సంఘ భవనాలు ఉన్న గ్రామం రాఘవాపూర్లో నిరుపేదలైన ఎస్సీ, బీసీ, ఓసీలలోని అత్యంత నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయింపు చేశాం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రెండు పడకగదుల ఇళ్లు కట్టించి ‌ఇస్తున్నాం.డబుల్ బెడ్ రూమ్ కాలనీని క్లీన్ గా ఉంచాల్సింది మీరే. డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు ఓ కమిటీ ‌వేసుకుని, కొంత మొత్తం ప్రతీ ఇంటి నుండి వసూలు‌ చేసుకోవాలి. ఆ డబ్బును కమిటీ ఆధ్వర్యంలో కాలనీ అభివృద్ధికి వినియోగించాలి. ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటాలి‌, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా చేసి పంచాయతీ సహకారాన్ని ఇవ్వాలి.ప్లాస్టిక్ నిషేధం విధించి గ్రామంలో ప్లాస్టిక్ వాడోద్దు. రూ.1 కోటి 50 లక్షలతో ఇండ్లు నిర్మించి, చాలా మంది నిరుపేదలకు ఇళ్లు కేటాయించాం.పిట్టల వాళ్లకు కూడా త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తాం.కాళేశ్వరం నీళ్ల ద్వారా చెరువులు నింపి రెండు పంటలు పండించేందుకు కృషి చేస్తా.యాసంగి పంటకు కాళేశ్వరం నీళ్లు తెస్తాం. కాల్వలకు భూములను ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలని గ్రామస్తులకు విన్నపం. రోడ్ల నిర్మాణం పనులు దశల వారీగా చేపడుతాం.అన్నీ వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శుభ్రంగా కాపాడుకోవాలి. బైట్: ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు

For All Latest Updates

TAGGED:

HARISH TOUR
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.