ETV Bharat / state

సిద్దిపేట మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా కడవేర్గు మంజుల

author img

By

Published : May 7, 2021, 4:48 PM IST

Updated : May 7, 2021, 6:50 PM IST

సిద్దిపేట మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా కడవేర్గు మంజుల ఖరారయ్యారు. వైస్​ ఛైర్మన్​గా జంగిటి కనకరాజు ఎంపికయ్యారు.

siddipet municipality
siddipet municipality
సిద్దిపేట మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా కడవేర్గు మంజుల

సిద్దిపేట మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా కడవేర్గు మంజుల, వైస్​ ఛైర్మన్​గా జంగిటి కనకరాజు ఎంపికయ్యారు. సిద్దిపేట మున్సిపల్​ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఛైర్​పర్సన్​, వైస్​ ఛైర్మన్లతో పాటు 43 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం కౌన్సిలర్లు అందరూ ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. కలెక్టర్ వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. పురపాలక సంఘం నూతన పాలక వర్గానికి మంత్రి, ఎంపీ అభినందనలు తెలిపారు. ఛైర్​పర్సన్​ మంజులను సత్కరించారు.

ఇటీవల జరిగిన సిద్దిపేట పురపోరులో తెరాస తెరాస తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 43 స్థానాల్లో తెరాస 36 స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు ఐదు చోట్ల విజయం సాధించారు. ఇక భాజపా, ఎంఐఎం ఒక్కో స్థానం దక్కించుకున్నాయి. ఏ ఒక్క వార్డులోను కాంగ్రెస్​ ఖాతా తెరవలేదు.

ఇదీ చూడండి: గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి

సిద్దిపేట మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా కడవేర్గు మంజుల

సిద్దిపేట మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా కడవేర్గు మంజుల, వైస్​ ఛైర్మన్​గా జంగిటి కనకరాజు ఎంపికయ్యారు. సిద్దిపేట మున్సిపల్​ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఛైర్​పర్సన్​, వైస్​ ఛైర్మన్లతో పాటు 43 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం కౌన్సిలర్లు అందరూ ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. కలెక్టర్ వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. పురపాలక సంఘం నూతన పాలక వర్గానికి మంత్రి, ఎంపీ అభినందనలు తెలిపారు. ఛైర్​పర్సన్​ మంజులను సత్కరించారు.

ఇటీవల జరిగిన సిద్దిపేట పురపోరులో తెరాస తెరాస తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 43 స్థానాల్లో తెరాస 36 స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు ఐదు చోట్ల విజయం సాధించారు. ఇక భాజపా, ఎంఐఎం ఒక్కో స్థానం దక్కించుకున్నాయి. ఏ ఒక్క వార్డులోను కాంగ్రెస్​ ఖాతా తెరవలేదు.

ఇదీ చూడండి: గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి

Last Updated : May 7, 2021, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.