ETV Bharat / state

మీరే ట్రెండ్ సెట్టర్స్, మోడల్​గా నిలవాలి - Siddipeta Government Medical College First and Second Batch Students

సిద్దిపేట మెడికల్ కళాశాల ఫ్రెషర్స్ పార్టీకి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరై విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో సిద్దిపేటకు పీజీ మెడికల్ కళాశాల తీసుకొస్తానని అన్నారు.

మీరే ట్రెండ్ సెట్టర్స్, మోడల్​గా నిలవాలి
author img

By

Published : Nov 20, 2019, 12:43 PM IST

సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఫ్రెషర్స్ పార్టీకి మంగళవారం ఓపెన్ ఏయిర్ ఆడిటోరియం వేదికైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్​లు హాజరై విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు.

సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల మొదటి, ద్వితీయ బ్యాచ్ విద్యార్థులు మీరే ట్రెండ్ సెట్టర్స్ కావాలని మంత్రి హరీశ్ రావు పిలుపు నిచ్చారు. ఎంతో కష్టపడి చదివితే కానీ ఈ కళాశాలలో సీటు లభించదని, ఈ ఐదేళ్లు మీరు మా అతిథులు, మా కుటుంబ సభ్యులని అన్నారు.

ఇటీవల మెడికల్ కళాశాల సందర్శనలో భాగంగా తన దృష్టికి వచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే త్వరలోనే 500 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సమాజంలో ఎన్నో రంగాల వారు ఉన్నా.. వైద్యుడు అంటే ఒక గౌరవ భావం ఉన్నదని, జన్మనిచ్చే వాడు దేవుడైతే.. పునర్జన్మనిచ్చే వాడు డాక్టరని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తమిళ అరసు, సూపరింటెండెంట్ చంద్రయ్య, మెడికల్ కళశాల డైరెక్టర్లు, ప్రొఫెసర్లు, కళాశాల అధ్యాపక బృందం, పలువురు విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

మీరే ట్రెండ్ సెట్టర్స్, మోడల్​గా నిలవాలి

ఇదీ చూడండి : వెట్టిచాకిరి నుంచి బాలకార్మికులకు ఎన్​హెచ్​ఆర్సీ విముక్తి

సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఫ్రెషర్స్ పార్టీకి మంగళవారం ఓపెన్ ఏయిర్ ఆడిటోరియం వేదికైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్​లు హాజరై విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు.

సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల మొదటి, ద్వితీయ బ్యాచ్ విద్యార్థులు మీరే ట్రెండ్ సెట్టర్స్ కావాలని మంత్రి హరీశ్ రావు పిలుపు నిచ్చారు. ఎంతో కష్టపడి చదివితే కానీ ఈ కళాశాలలో సీటు లభించదని, ఈ ఐదేళ్లు మీరు మా అతిథులు, మా కుటుంబ సభ్యులని అన్నారు.

ఇటీవల మెడికల్ కళాశాల సందర్శనలో భాగంగా తన దృష్టికి వచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే త్వరలోనే 500 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సమాజంలో ఎన్నో రంగాల వారు ఉన్నా.. వైద్యుడు అంటే ఒక గౌరవ భావం ఉన్నదని, జన్మనిచ్చే వాడు దేవుడైతే.. పునర్జన్మనిచ్చే వాడు డాక్టరని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తమిళ అరసు, సూపరింటెండెంట్ చంద్రయ్య, మెడికల్ కళశాల డైరెక్టర్లు, ప్రొఫెసర్లు, కళాశాల అధ్యాపక బృందం, పలువురు విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

మీరే ట్రెండ్ సెట్టర్స్, మోడల్​గా నిలవాలి

ఇదీ చూడండి : వెట్టిచాకిరి నుంచి బాలకార్మికులకు ఎన్​హెచ్​ఆర్సీ విముక్తి

Intro:TG_SRD_72_23_HARISH RAO_SCRIPT_TS10058

యాంకర్: అంక్షాపూర్ గ్రామ నభి చెరువులో..
70 వేల చేప పిల్లలను వదిలిన మంత్రి హరీశ్ సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని అంక్షాపూర్ గ్రామంలోని నభి చెరువులో బుధవారం ఉదయం మత్స్యశాఖ ఆధ్వర్యంలో 70వేల చేప పిల్లలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా వదిలారు. Body:వీటిలో బొత్స, రవ్వ, మెరిగ మూడు రకాల చేపలు ఉండగా, అనంతరం బద్ధిపడగ మధిర గ్రామ దర్గా వద్దనున్న చెక్ డ్యామ్ లో 50వేల చేపలను మంత్రి చేతుల మీదుగా వాగులో వదిలారు. Conclusion:అదే విధంగా అక్కెనపల్లి గ్రామ చెక్ డ్యామ్ లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మరో 50వేల చేప పిల్లలు వదిలినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్య పేర్కొన్నారు. మంత్రి వెంట ఏంపీపీ ఉమా వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి, గ్రామ సర్పంచ్, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్య, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.