సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని విశ్వనాథ పల్లి గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. నంగనూరు మండలం రాజగోపాల్పేట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై హైదరాబాద్కి బయలుదేరారు.
విశ్వనాథపల్లి వద్దకు రాగానే కుక్క అడ్డుగా రావడంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో రాజగోపాల్పేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
ఇవీ చూడండి: హైదరాబాద్లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం