సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పెద్ద గుండవెల్లి, తిమ్మాపూర్, పద్మనాభునిపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం క్రింద సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
పెద్ద గుండవెల్లిలో శంకుస్థాపన అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే స్థానికంగా ప్రసిద్ధి చెందిన రేణుక ఎల్లమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు కడతల రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, ఆయా గ్రామాల సర్పంచులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సింధియా రాజీనామా వెనుక జరిగిన కథ ఇదే...