ETV Bharat / state

'ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు నిరూపితమైంది' - దుబ్బాక బీజేపీ విజయంపై కిషన్​ రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్​

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టత వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో రాబోయే జీహెచ్​ఎంసీ, పట్టభద్రుల మండలి, 2023లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని నిరూపితమైందంటున్న కిషన్‌రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.

ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు నిరూపితమైంది: కిషన్​ రెడ్డి
ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు నిరూపితమైంది: కిషన్​ రెడ్డి
author img

By

Published : Nov 11, 2020, 5:06 AM IST

Updated : Nov 11, 2020, 6:14 AM IST

దుబ్బాక ఉప ఎన్నికలో ప్రజలు భాజపాకు పట్టం కట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. తెరాస పరిపాలన పట్ల ప్రజలు విసిగిపోయినట్లు నిరూపితమైందన్నారు. దుబ్బాక యువత పోరాటం వల్లే భాజపా విజయం సాధించిందని వివరించారు. అన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భాజపాను స్వాగతించారని తెలిపారు.

దుబ్బాకలో అధికార పార్టీ దౌర్జన్యాలను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. కొవిడ్‌, వరదలు వంటి విపత్తుల వేళ కేంద్రం ప్రజలకు అండగా నిలిచిందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న రాష్ట్ర సర్కారు కొవిడ్‌ వేళ ప్రజలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దురుద్దేశంతోనే వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వడం లేదని కిషన్​ రెడ్డి ఆరోపించారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు నిరూపితమైంది: కిషన్​ రెడ్డి

ఇదీ చదవండి: ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితం: రఘునందన్​

దుబ్బాక ఉప ఎన్నికలో ప్రజలు భాజపాకు పట్టం కట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. తెరాస పరిపాలన పట్ల ప్రజలు విసిగిపోయినట్లు నిరూపితమైందన్నారు. దుబ్బాక యువత పోరాటం వల్లే భాజపా విజయం సాధించిందని వివరించారు. అన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భాజపాను స్వాగతించారని తెలిపారు.

దుబ్బాకలో అధికార పార్టీ దౌర్జన్యాలను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. కొవిడ్‌, వరదలు వంటి విపత్తుల వేళ కేంద్రం ప్రజలకు అండగా నిలిచిందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న రాష్ట్ర సర్కారు కొవిడ్‌ వేళ ప్రజలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దురుద్దేశంతోనే వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వడం లేదని కిషన్​ రెడ్డి ఆరోపించారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు నిరూపితమైంది: కిషన్​ రెడ్డి

ఇదీ చదవండి: ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితం: రఘునందన్​

Last Updated : Nov 11, 2020, 6:14 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.