ETV Bharat / state

సీఎం పర్యటనపై మంత్రి హరీశ్​రావు సమీక్ష - కొండపోచమ్మ సాగర్

తెలంగాణలో మరో అద్భుత ఘట్టం సాక్షాత్కరించబోతోంది. కొండపోచమ్మ సాగర్‌ను ఈ నెల 29న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్​ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.

minister Harish Rao review Meting with Government officers on CM KCR tour in Siddipet district
సీఎం సిద్దిపేట పర్యటనపై మంత్రి హరీశ్​రావు సమీక్ష
author img

By

Published : May 26, 2020, 7:34 PM IST

ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి హరీశ్​ రావు అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. కరోనా దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేయాలని అధికార వర్గాలకు మంత్రి సూచించారు.

అధికారులు నిద్రలేని రాత్రులతో అహర్నిశలు కృషి చేసి అన్ని రంగాల్లో సిద్ధిపేట జిల్లాను తొలి స్థానంలో నిలుపుతున్నారని మంత్రి కొనియాడారు. కార్యక్రమం మొదలు నుంచి చివరి వరకూ శాఖల వారీగా అధికారులకు, నిర్వాహక బాధ్యతలను అప్పగిస్తూ చేపట్టాల్సిన విధులను వివరించారు.

ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి హరీశ్​ రావు అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. కరోనా దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేయాలని అధికార వర్గాలకు మంత్రి సూచించారు.

అధికారులు నిద్రలేని రాత్రులతో అహర్నిశలు కృషి చేసి అన్ని రంగాల్లో సిద్ధిపేట జిల్లాను తొలి స్థానంలో నిలుపుతున్నారని మంత్రి కొనియాడారు. కార్యక్రమం మొదలు నుంచి చివరి వరకూ శాఖల వారీగా అధికారులకు, నిర్వాహక బాధ్యతలను అప్పగిస్తూ చేపట్టాల్సిన విధులను వివరించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.