సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహిళలు తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇవ్వట్లేదని మంత్రి హరీశ్ రావు అసహనం వ్యక్తం చేశారు. 'తడి, పొడి చెత్త బుట్టలిచ్చినా... వేరుగా ఇవ్వట్లేదు... ఏం చేయమంటారో మీరే చెప్పండని మహిళలను ప్రశ్నించారు. తడి, పొడి చెత్తలను వేరుగా ఇస్తానని పోచమ్మ తల్లిపై ఒట్టేస్తారా..? 500 జరిమానా కడ్తారా..? చెప్పండీ' అంటూ అడిగారు మంత్రి హరీశ్ రావు.
ఇందుకు స్పందించిన మహిళలు ఒట్టేయమని తెలిపారు. తడి, పొడి చెత్తలను వేరుగా ఇస్తామన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే 500 రూపాయల జరిమానానైనా కడతామన్నారు. ఇందుకు మంత్రి హరీశ్ రావు... పోచమ్మ తల్లి చాలా శక్తిమంతమైన దేవత.. అందుకే ఒట్టేయమంటున్నారంటూ నవ్వారు.
ఇవీ చూడండి: పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!