సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ఆ సంస్థ ఉద్యోగులు, ఏజెంట్లు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్ఐసీని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని.. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే కుట్రలు జరుగుతున్నాయని.. ఈ ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించారు. లేనియెడల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'ప్రపంచమంతా కరోనాకు వ్యతిరేకంగా పోరాడాలి'