ETV Bharat / state

ఓ వైపు కరోనా మహమ్మారి ... మరోవైపు ప్రకృతి కన్నెర్ర - heavy rain in siddipet

కరోనా మహమ్మారి వల్ల జీవనోపాధి కోల్పోయి కుటుంబ పోషణే భారమైన ఆ వ్యక్తిపై ప్రకృతి కన్నెర్ర చేసింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు ఉన్న ఇల్లు కాస్త నేలమట్టమైంది. ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో పాలుపోక సాయం కోసం వేచిచూస్తున్నాడు ఆ కుటుంబ యజమాని.

house collapsed in siddipet due to heavy rain from one week
ఓ వైపు కరోనా మహమ్మారి ... మరోవైపు ప్రకృతి కన్నెర్ర
author img

By

Published : Aug 17, 2020, 12:48 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 18వ వార్డులో చేనేత కార్మికుడు మెతుకు ఆంజనేయులు కుటుంబం నివాసముంటోంది. దివ్యాంగుడైన ఆంజనేయులు ఎంఏ బీఎడ్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహించేవాడు. కరోనా మహమ్మారి వల్ల ఆరు నెలలుగా విద్యాసంస్థలన్నీ మూతపడటం వల్ల ఉపాధి కోల్పోయిన ఆంజనేయులు కుటుంబాన్ని పోషించలేక అవస్థలు పడుతున్నాడు.

వారం రోజుల నుంచి కురుస్తున్న వానతో ఉన్న పెంకుటిల్లు కాస్త నేలమట్టమైంది. కరోనాతో ఉపాధి కోల్పోయి ఒక పూట తింటూ మరో పూట పస్తులుంటున్నామని ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు కుటుంబాన్ని పోషించడమే భారమైన ఈ తరుణంలో ప్రకృతి పగబట్టినట్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ఉన్న ఇల్లు కాస్త నేలమట్టమయిందని వాపోయారు. ప్రభుత్వం, దాతలు సహకరించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 18వ వార్డులో చేనేత కార్మికుడు మెతుకు ఆంజనేయులు కుటుంబం నివాసముంటోంది. దివ్యాంగుడైన ఆంజనేయులు ఎంఏ బీఎడ్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహించేవాడు. కరోనా మహమ్మారి వల్ల ఆరు నెలలుగా విద్యాసంస్థలన్నీ మూతపడటం వల్ల ఉపాధి కోల్పోయిన ఆంజనేయులు కుటుంబాన్ని పోషించలేక అవస్థలు పడుతున్నాడు.

వారం రోజుల నుంచి కురుస్తున్న వానతో ఉన్న పెంకుటిల్లు కాస్త నేలమట్టమైంది. కరోనాతో ఉపాధి కోల్పోయి ఒక పూట తింటూ మరో పూట పస్తులుంటున్నామని ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు కుటుంబాన్ని పోషించడమే భారమైన ఈ తరుణంలో ప్రకృతి పగబట్టినట్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ఉన్న ఇల్లు కాస్త నేలమట్టమయిందని వాపోయారు. ప్రభుత్వం, దాతలు సహకరించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.