ETV Bharat / state

తమను సర్కారే ఆదుకోవాలి: ఎరుకుల విద్యార్థి యువజన సంఘం

పందులపై ఆధారపడి జీవించే తమ కులస్థులను ప్రభుత్వమే ఆదుకోవాలని తెలంగాణ ఎరుకల విద్యార్థి యువజన సంఘం విజ్ఞప్తి చేసింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని రాజరాజేశ్వరి గార్డెన్​లో నిర్వహించిన తెలంగాణ ఎరుకల విద్యార్థి యువజన సంఘం వెల్లడించింది.

author img

By

Published : Sep 5, 2020, 8:05 PM IST

తమను సర్కారే ఆదుకోవాలి: ఎరుకుల విద్యార్థి యువజన సంఘం
తమను సర్కారే ఆదుకోవాలి: ఎరుకుల విద్యార్థి యువజన సంఘం

పందులపై ఆధారపడి జీవించే తమ కులస్థులను ప్రభుత్వమే ఆదుకోవాలని తెలంగాణ ఎరుకల విద్యార్థి యువజన సంఘం కోరింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని రాజరాజేశ్వరి గార్డెన్​లో నిర్వహించిన తెలంగాణ ఎరుకల విద్యార్థి యువజన సంఘం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి వెల్లడించారు.

ప్రత్యక్షంగా... పరోక్షంగా...

తెలంగాణలో పందులపై ఆధారపడి జీవించే ఎరుకల కులస్తుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన జీఓను అమలు చేయాలని కోరారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పందుల గైడ్ లైన్స్​కు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు ఎరుకల కులస్తులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

మాకు రాజకీయం.. సామాజిక గుర్తింపు లేదు

ఎరుకల కులస్తులకు రాజకీయం, సామాజిక గుర్తింపు లేకుండాపోయిందని తిరుపతి వాపోయారు. తెలంగాణ ఉద్యమంలో ఎరుకల కులస్తులు చురుగ్గా పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఎరుకల కులస్తులను ఆదుకోవాలన్నారు.

త్వరలో కమిటీలు...

సిద్దిపేట జిల్లాలో మండలాలు, గ్రామాల వారీగా పెద్ద ఎత్తున ఎరుకల కులస్తులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎరుకల కులస్తుల పై జరుగుతున్న దాడులను, అన్యాయాలను అరికట్టడానికి తెలంగాణ ఎరుకల విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో ఎరుకల యువత ఏకమై జాతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి : టీచర్ల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది: బండి సంజయ్

పందులపై ఆధారపడి జీవించే తమ కులస్థులను ప్రభుత్వమే ఆదుకోవాలని తెలంగాణ ఎరుకల విద్యార్థి యువజన సంఘం కోరింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని రాజరాజేశ్వరి గార్డెన్​లో నిర్వహించిన తెలంగాణ ఎరుకల విద్యార్థి యువజన సంఘం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి వెల్లడించారు.

ప్రత్యక్షంగా... పరోక్షంగా...

తెలంగాణలో పందులపై ఆధారపడి జీవించే ఎరుకల కులస్తుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన జీఓను అమలు చేయాలని కోరారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పందుల గైడ్ లైన్స్​కు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు ఎరుకల కులస్తులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

మాకు రాజకీయం.. సామాజిక గుర్తింపు లేదు

ఎరుకల కులస్తులకు రాజకీయం, సామాజిక గుర్తింపు లేకుండాపోయిందని తిరుపతి వాపోయారు. తెలంగాణ ఉద్యమంలో ఎరుకల కులస్తులు చురుగ్గా పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఎరుకల కులస్తులను ఆదుకోవాలన్నారు.

త్వరలో కమిటీలు...

సిద్దిపేట జిల్లాలో మండలాలు, గ్రామాల వారీగా పెద్ద ఎత్తున ఎరుకల కులస్తులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎరుకల కులస్తుల పై జరుగుతున్న దాడులను, అన్యాయాలను అరికట్టడానికి తెలంగాణ ఎరుకల విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో ఎరుకల యువత ఏకమై జాతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి : టీచర్ల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.