ETV Bharat / state

చింతమడకలో హెల్త్ క్యాంపు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సూచిక ఉండాలనే లక్ష్యంతో ఇటీవల చింతమడక పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ వెల్లడించారు. హరీశ్ రావు దీనిని ప్రారంభించనున్న నేపథ్యంలో వైద్య శిబిర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామారెడ్డి పరిశీలించారు.

author img

By

Published : Aug 4, 2019, 11:52 PM IST

చింతమడకలో హెల్త్ క్యాంపు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సీఎం కేసీఆర్‌ స్వగ్రామం చింతమడకలో ప్రత్యేక ఆరోగ్య వైద్యశిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.వెంకట్రామారెడ్డి తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఆరోగ్య వైద్య శిబిర ఏర్పాట్లను ఆర్డీవో జయచంద్రా రెడ్డి, డీఎంహెచ్​వో అమర్ సింగ్​లతో కలిసి పరిశీలించారు. మాజీ మంత్రి హరీశ్ రావు, యశోదా ఆసుపత్రి వ్యవస్థాపకులతో కలిసి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రతి రోజు 2 వార్డుల చొప్పున వైద్య పరీక్షలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి కౌంటరు వద్ద సూచిక బోర్డులు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

చింతమడకలో హెల్త్ క్యాంపు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఇవీచూడండి: 'కశ్మీర్​ ప్రత్యేక హోదా కాపాడేందుకు ఉమ్మడి పోరాటం'

సీఎం కేసీఆర్‌ స్వగ్రామం చింతమడకలో ప్రత్యేక ఆరోగ్య వైద్యశిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.వెంకట్రామారెడ్డి తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఆరోగ్య వైద్య శిబిర ఏర్పాట్లను ఆర్డీవో జయచంద్రా రెడ్డి, డీఎంహెచ్​వో అమర్ సింగ్​లతో కలిసి పరిశీలించారు. మాజీ మంత్రి హరీశ్ రావు, యశోదా ఆసుపత్రి వ్యవస్థాపకులతో కలిసి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రతి రోజు 2 వార్డుల చొప్పున వైద్య పరీక్షలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి కౌంటరు వద్ద సూచిక బోర్డులు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

చింతమడకలో హెల్త్ క్యాంపు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఇవీచూడండి: 'కశ్మీర్​ ప్రత్యేక హోదా కాపాడేందుకు ఉమ్మడి పోరాటం'

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_71_04_COLLCTOR_VISIT_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: చింతమడకలో ఆరోగ్య వైద్య శిబిరం -ప్రారంభించనున్న మాజీ మంత్రి హరీశ్ రావు, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి సీఎం కేసీఆర్‌ స్వగ్రామం చింతమడకలో నుంచి ప్రత్యేక ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించి గ్రామస్థులందరికీ అన్నీ రకాల వైద్య పరీక్షలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామారెడ్డి తెలిపారు. సిద్ధిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఆరోగ్య వైద్య శిబిర ఏర్పాట్లను ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, డీఎంహెచ్ఓ అమర్ సింగ్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మాజీ మంత్రి హరీశ్ రావు, యశోధా ఆసుపత్రి వ్యవస్థాపకులతో కలిసి ప్రారంభించనున్నట్లు తెలిపారు. హెల్త్ క్యాంపు ప్రతి రోజు 2 వార్డుల చొప్పున వైద్య పరీక్షలు చేపట్టనున్నట్లు, 5వ తేది సోమవారం రోజు గ్రామంలోని 1వ, 2వ వార్డులోని ప్రజలకు వైద్యులు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు జరుపుతారని, 1వ వార్డులో 186 మంది, 2వ వార్డులో 184 మంది మొత్తం 370 మందికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కౌంటరు వద్ద సూచిక బోర్డులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.