ETV Bharat / state

ఎన్ని నాటకాలు ఆడినా భాజపా గెలుపు ఖాయం: డీకే అరుణ - bjp national precident dk aruna election campaignlatest

తెరాస పార్టీని ఓడించే దమ్ము ఒక భాజపాకే ఉందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​కు ఆదరణ కరవై.. కేసీఆర్​కు అమ్మేశారని ఆరోపించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఆకారం, గంభీర్​పూర్ గ్రామాల్లో భాజపా అభ్యర్థి రఘనందన్ రావుతో పాటు డీకే అరుణ ప్రచారంలో పాల్గొన్నారు.

bjp national precident dk aruna on dubbaka election campaign
ఎన్ని నాటకాలు ఆడినా భాజపా గెలుపు ఖాయం: డీకే అరుణ
author img

By

Published : Oct 31, 2020, 5:24 PM IST

తెరాస నాయకులు భాజపా కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎన్ని నాటకాలు ఆడినా భాజపా అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం, గంభీర్​పూర్ గ్రామాల్లో భాజపా అభ్యర్థి రఘనందన్ రావుతో పాటు డీకే అరుణ ప్రచారంలో పాల్గొన్నారు.

ఆదరణ కరవై.. అమ్మేశారు

కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కరవై.. కేసీఆర్​కు అమ్మేశారని డీకే అరుణ ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రజల్లో కనిపించడం లేదని.. కాంగ్రెస్ భూస్థాపితం అయిందని విమర్శించారు. తెరాసలో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి భాజపాను అడ్డుకోవాలనే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చారన్నారు. తెరాస పెద్దలు పార్టీ ఓడిపోతుందని భయంతోనే ఇలా చేశారనన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లే ఎద్దేవా చేశారు.

తెరాసని ఓడించే దమ్ము ఒక భాజపాకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను ఓటు అడిగే హక్కు తెరాసకి లేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్​ చేశారు. సమర్థుడైన రఘునందన్ రావుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఇదీ చూడండి: అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తా: కేసీఆర్

తెరాస నాయకులు భాజపా కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎన్ని నాటకాలు ఆడినా భాజపా అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం, గంభీర్​పూర్ గ్రామాల్లో భాజపా అభ్యర్థి రఘనందన్ రావుతో పాటు డీకే అరుణ ప్రచారంలో పాల్గొన్నారు.

ఆదరణ కరవై.. అమ్మేశారు

కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కరవై.. కేసీఆర్​కు అమ్మేశారని డీకే అరుణ ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రజల్లో కనిపించడం లేదని.. కాంగ్రెస్ భూస్థాపితం అయిందని విమర్శించారు. తెరాసలో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి భాజపాను అడ్డుకోవాలనే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చారన్నారు. తెరాస పెద్దలు పార్టీ ఓడిపోతుందని భయంతోనే ఇలా చేశారనన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లే ఎద్దేవా చేశారు.

తెరాసని ఓడించే దమ్ము ఒక భాజపాకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను ఓటు అడిగే హక్కు తెరాసకి లేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్​ చేశారు. సమర్థుడైన రఘునందన్ రావుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఇదీ చూడండి: అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తా: కేసీఆర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.