ETV Bharat / state

'నిర్వాసితులందరికీ సమానంగా పరిహారం ఇవ్వాలి' - toguta news

సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్​రావు పర్యటించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని పలువురు యువకులు పార్టీలో చేరారు.

bjp leader ragunandan rao visited in ellareddypet
bjp leader ragunandan rao visited in ellareddypet
author img

By

Published : Sep 5, 2020, 4:43 PM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్​రావు పర్యటించారు. గ్రామంలో భాజపా జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో కలియతిరుగుతూ గ్రామ ప్రజల సాధకబాధకాలను ఆత్మీయ పలకరింపుతో తెలుసుకున్నారు. గ్రామంలోని సీనియర్ నాయకులు,యువకులు రఘునందన్ రావు సమక్షంలో పార్టీలో చేరారు.

ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు, కాలువలకు భాజపా వ్యతిరేకం కాదని రఘనందన్​రావు తెలిపారు. భూమిని కోల్పోయిన నిర్వాసితులకు అందరికీ సమానంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ భాజపా నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందే!'

సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్​రావు పర్యటించారు. గ్రామంలో భాజపా జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో కలియతిరుగుతూ గ్రామ ప్రజల సాధకబాధకాలను ఆత్మీయ పలకరింపుతో తెలుసుకున్నారు. గ్రామంలోని సీనియర్ నాయకులు,యువకులు రఘునందన్ రావు సమక్షంలో పార్టీలో చేరారు.

ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు, కాలువలకు భాజపా వ్యతిరేకం కాదని రఘనందన్​రావు తెలిపారు. భూమిని కోల్పోయిన నిర్వాసితులకు అందరికీ సమానంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ భాజపా నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందే!'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.