సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంకు చెందిన గంగారం సంజీవులు, పెద్దింటి ఆంజనేయులు కలిసి రాత్రి సమయంలో ఆటో నడుపుకునేందుకు అద్దెకు తీసుకునేవారు. ఆటో తీసుకుని వెళ్లి.. దేవాలయాల్లోని హుండీలు పగలగొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లేవారు. ఇలా పటాన్చెరు, కేపీహెచ్బీ, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవాలయాల్లో దొంగతనాలు చేశారు. ఈ నెల 12న పటాన్చెరు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న సంజీవులు, ఆంజనేయులును అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో నేరం ఒప్పుకోవడం వల్ల నిందితులను రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ.8 వేల నగదు, ఒక ఆటో, చోరీకి ఉపయోగించే ఇనప రాడ్ను స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి:సమ్మెలో పాల్గొన్న వారిని తిరిగి తీసుకోవద్దు