గడ్డపోతారం పారిశ్రామికవాడలో కాలుష్య కారక పరిశ్రమలను మూసివేయాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీచేసింది.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో కాలుష్య కారక పరిశ్రమలతో గత కొంత కాలంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వాటిని పరిశీలించిన నియంత్రణ మండలి అధికారులు వీవిన్ ల్యాబ్స్, రక్షిత్ డ్రగ్స్ పరిశ్రమలను మూసివేయాలని ఉత్తర్వులు జారీచేశారు. ఇంకా చాలా పరిశ్రమలు ఉన్నాయని వాటిపైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీచూడండి: దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి బయోనిక్ చేయి...