ETV Bharat / state

'ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలి...' - SC, ST FUNDS REVIEW MEETING AT SANGAREDDY COLLECTORATE

సంగారెడ్డి కలెక్టరేట్​లో ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధుల మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్​ హన్మంతరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో అంధోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు.

SC, ST FUNDS REVIEW MEETING AT SANGAREDDY COLLECTORATE
author img

By

Published : Nov 23, 2019, 8:56 AM IST

ఎస్సీ, ఎస్టీలు సామాజికంగా, ఆర్థికంగా అందరితో సమానంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బడ్డెట్​లో ప్రత్యేక నిధులు కేటాయించిందని సంగారెడ్డి కలెక్టర్​ హన్మంతరావు పేర్కొన్నారు. సంక్షేమ నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని అధికారులకు కలెక్టర్​ సూచించారు. కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధుల మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలకు కేటాయించిన నిధులు, పనుల పురోగతిపై సమీక్షించారు. మార్చి నాటికి లక్ష్యాలు చేరుకునేలా పనులు వేగవంతం చేయాలన్నారు. అంధోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సమావేశంలో పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, అందుకు తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యేలు అధికారులకు స్పష్టం చేశారు.

'ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలి...'

ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'

ఎస్సీ, ఎస్టీలు సామాజికంగా, ఆర్థికంగా అందరితో సమానంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బడ్డెట్​లో ప్రత్యేక నిధులు కేటాయించిందని సంగారెడ్డి కలెక్టర్​ హన్మంతరావు పేర్కొన్నారు. సంక్షేమ నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని అధికారులకు కలెక్టర్​ సూచించారు. కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధుల మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలకు కేటాయించిన నిధులు, పనుల పురోగతిపై సమీక్షించారు. మార్చి నాటికి లక్ష్యాలు చేరుకునేలా పనులు వేగవంతం చేయాలన్నారు. అంధోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సమావేశంలో పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, అందుకు తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యేలు అధికారులకు స్పష్టం చేశారు.

'ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలి...'

ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'

TG_SRD_58_22_MEETING_AS_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) ఎస్సి, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్ లో 15 శాతం వారి సంక్షేమానికి ఖర్చు చేస్తామని జిల్లా కలెక్టర్ యం.హనుమంత రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఎస్సి, ఎస్టీ ల అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హాజరయ్యారు. ఎస్సి, ఎస్టీలు ఆర్థికంగా అందరితో సమానంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని.. ఆ నిధులను వారి సంక్షేమానికే ఖర్చు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో వివిధ శాఖలకు కేటాయించిన నిధులు, పనుల పురోగతి పై సమీక్షిస్తూ మార్చి నాటికి లక్ష్యాలను చేధించాలని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని, అందుకు తమ వంతు సహకారం ఉంటుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. ఎస్సి, ఎస్టీల సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులు వంద శాతం వారి సంక్షేమానికే ఖర్చు చేయాలని.. పథకాలు ఎలా అమలు చేస్తున్నారో ప్రజాప్రతినిధులకు వివరిస్తే తగు సూచనలు, సలహాలు ఇస్తామని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు...... SPOT

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.