సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి శివారులోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దు అంతర్రాష్ట్ర చెక్పోస్టును కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. జిల్లాలో కరోనా కేసులు లేకపోయినా లాక్డౌన్ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే వారి వివరాలు అంతర్జాలంలో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహించే మహిళలకు రాత్రి పూట మినహాయింపు ఇవ్వాలని చెప్పారు.